Sanjush Accident: ఇనార్బిట్ మాల్ దగ్గర లింగమనేని సంజూష్ చేసిన ర్యాష్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ తో ఓ యువతి బలైపోయింది. ఈ కేసు చుట్టూనే ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది. ఈ కేసులో లింగమనేని సంజూష్పై BNS 106-1 కింద కేసు నమోదైంది. ప్రమాదం తర్వాత పోలీసులు ఆల్కహాల్, డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్గా వచ్చాయని.. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో వెంటనే అరెస్ట్ తప్పనిసరి కాదని పోలీసులు చెబుతున్నారు.
అయితే.. ఇక్కడే అసలు డిబేట్ మొదలవుతోంది. సామాన్యుడు ఇదే కేసులో ఉంటే ఇదే విధానం ఉండేదా? నోటీసులతోనే విచారణ కొనసాగిస్తే.. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఎలా కల్పిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయ్. మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు లేవని పోలీసులు చెబుతున్నారు. కానీ చాలా డౌట్లు అలాగే ఉన్నాయ్.
Also read: అంజయ్యనగర్లో హైడ్రా ఆపరేషన్.. ఆ భవనాల కూల్చివేస్తాం వెంటనే ఖాళీ చేయండి: రంగనాథ్
FIRలో పూర్తి పేరు లేకపోవడం, ఎంత స్పీడ్ లో వెళ్లాడు? ర్యాష్ డ్రైవింగ్ సీసీ ఫుటేజ్ బయటకు రాకపోవడం, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం, ఆగస్టు 16న ఘటన జరిగితే కేసు వేయడానికి లేట్ అవడం, సంజూష్ కు చేసిన టెస్టు రిపోర్టులు బయటపెట్టకపోవడం ఇవన్నీ కీ ఫ్యాక్టర్ గా మారుతున్నాయ్. ఈ మొత్తం ఎపిసోడ్ లో వీఐపీ అయినా.. కామన్ మ్యాన్ అయినా.. న్యాయ ప్రక్రియ ఒకేలా ఉండాల్సిందే కదా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.
Also Read: పిల్లలకు పార్సిల్స్ ఇచ్చే విమానం… కొత్త గ్యాడ్జెట్స్తో పిల్లలను ఎంటర్టైన్ చేసే ఫాంటసీ అడ్వెంచర్