Elephant Rescue: కేరళలోని తన్నితోడులో ఓ ఏనుగు పిల్ల బావిలో పడిపోయింది. రాత్రి రబ్బరు తోటలోకి ఏనుగుల గుంపు ప్రవేశించగా చీకట్లో దారి తెలియక, రెండేళ్ల వయసున్న ఏనుగు పిల్ల బావిలో చిక్కుకుంది. అయితే తెల్లవారుజామున ఏనుగుల గుంపు అరవడాన్ని స్థానికులు గమనించారు. అనుమానం వచ్చి రబ్బరు తోట వైపు వెళ్లి చూడగా, బావిలోని ఏనుగు పిల్ల పైకి రాలేక తల్లడిల్లుతూ కనిపించింది.
తోట యజమాని గోపి, స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ సిబ్బంది జేసీబీతో సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే ఏనుగుల గుంపు సమీపంలోనే ఉండటంతో రెస్క్యూ టీమ్ మొదట కాస్త ఆందోళన చెందింది. ఆ తర్వాత ఏనుగులు కొద్దిగా వెనక్కి తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఏనుగు పిల్లకు ఎటువంటి గాయాలు కాకుండా, బావికి ఒక వైపు భాగాన్ని జేసీబీతో తవ్వారు. అంతేకాదు సులభంగా పైకి నడిచి రావడానికి వీలుగా మట్టి దారిని ఏర్పాటు చేశారు.
Also read: Sai Baba: సనాతన ధర్మంలో కొత్త వివాదం.. కుండబద్దలు కొట్టిన మంత్రి ఆనం..!
వాయిస్ 03 : అటవీ అధికారులు అనుకున్నట్టుగానే ఆ ఏనుగు పిల్ల మట్టి దారి గుండా నెమ్మదిగా పైకి వచ్చింది. బయటపడిన ఏనుగు పిల్లను ఫారెస్ట్ అధికారులు టపాసులు కాలుస్తూ అడవి వైపునకు మళ్లించారు. ప్రస్తుతం దాన్ని తిరిగి ఏనుగుల గుంపుతో కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ సక్సెస్ అయినప్పటికీ, స్థానికులు అటవీ శాఖ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఏనుగుల గుంపులు పంట పొలాల్లోకి వస్తూ నష్టం కలిగిస్తున్నాయంటున్నారు.
Storey By: Appa Rao Big Tv