Free Schemes: ప్రభుత్వ పథకాలు ఎవరికి చేరాలి? ఆకలితో అలమటించే అర్హుడికా.. అక్రమంగా అనుభవించే అపర కుబేరుడికా.. ఉచితాల మోజులో పడి ఆస్తిపరుల కడుపు నింపుతూ.. నిజమైన పేదవాడి నోటికాడి కూడును లాగేస్తున్నామా? నిరుపేదలకు చేయూత ఇవ్వాలనో, ఓటు బ్యాంకు రాజకీయాలో కోసమో ప్రభుత్వాలు ఎన్నో పథకాలను తీసుకొస్తున్నాయి.
కానీ పథకం ప్రకటించిన వెంటనే అర్హుల కంటే ముందే పార్టీల కార్యకర్తలు, ధనవంతులు ఎగబడిపోతున్నారు. చివరకు నిజమైన అర్హులకు ఆ పథకం అందని ద్రాక్షగా మారుతోంది. ప్రతి ఏటా పెరుగుతున్న ఉచిత పథకాలతో ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతోందన్న చర్చ ఎప్పటి నుంచో జరుగుతుంది. గతంలో సుప్రీంకోర్టు పథకాలు అవసరమా అంటూ కొన్ని ప్రశ్నలు సంధించింది. కోటి 15 లక్షల కుటుంబాలకు ఉచిత పథకాలు అందిస్తే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందని తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇదే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి.
Also Read: నీట్ లీకేజీ కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐ ఛార్జ్షీట్లో షాకింగ్ విషయాలు!
వందల ఎకరాలున్న వారికి కూడా రైతు భరోసా లాంటి పథకాలు అందుతూనే ఉన్నాయి. హైకోర్టు చేసిన ఈ కామెంట్స్ కేవలం ఒక విచారణ కాదు.. సంక్షేమం ముసుగులో సాగుతున్న చేదు నిజంపై ధ్వనించిన తీవ్ర హెచ్చరిక. అసలు ప్రజలకు ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇవ్వాలా వద్దా? ఇస్తే.. అర్హుల ఎంపికలో కఠిన నిబంధనలను ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయడం లేదు.
Also Read: రిసార్ట్కు రిలాక్స్ అవ్వడానికెళ్తే ఇదేం ట్విస్ట్ భయ్యా… ఊహించని క్లైమాక్స్