Voter Revision: ఓటు అంటే కేవలం కాగితం మీద ముద్రో, బాక్స్లో పడే బ్యాలెట్టో కాదు.. అది ఈ దేశ పౌరుడి ప్రాణవాయువు. కానీ తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు సామాన్య ఓటర్లలో తీరని ఆందోళన రేకెత్తిస్తోంది. ఎన్యుమరేషన్ గడువుకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. ఇప్పటి వరకు 80 శాతం ఎన్యుమరేషన్ కూడా పూర్తి కాలేదు.
Also Read: విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. గన్నవరం మెట్రో లైన్పై కీలక ముందడుగు!
ఇక గ్రేటర్ హైదరాబాద్లో లక్షలాది ఓట్లు గల్లంతు కావడం గ్యారంటీ. నివాసాలు మారడం, నకిలీ ఎంట్రీలు, సాంకేతిక లోపాల పేరుతో భారీగా కోతలు ఉంటాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది ఓటర్ల డేటా వెరిఫికేషన్ ఇంకా అస్పష్టంగానే ఉంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఓటర్ల ఇళ్లకు రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమయం చేజారిపోతుంటే, ప్రతీ ఇంటి తలుపు తట్టి ఓటును కాపాడాల్సిన వ్యవస్థలు నిద్రమత్తులో ఉన్నాయా? ప్రజల గొంతుకను నొక్కేసేలా, వేలాది ఓట్లను రద్దు చేసి సరిపెట్టుకుంటారా? లేక ప్రతీ అర్హుడికి ఓటు హక్కు మిగిలేలా చూస్తారా?
Also Read: పొత్తులు లేవు.. ఒంటరిగానే బరిలోకి.. జనసేనకు తెలంగాణ బీజేపీ షాక్!