UPI Charges: జనాలు పర్సులో మనీ మెయింటైన్ చేయడం ఎప్పుడో మర్చిపోయారు. అంత ఫోన్ స్క్రీన్ టచ్కే అలవాటుపడిపోయారు. సంతలో సరుకులు కొన్నా.. పెద్ద మాల్లో షాపింగ్ చేసినా మొబైల్ తీసి పేమెంట్ చేసి వెళ్లిపోతారు. అయితే యూపీఐ ద్వారా జరిగే కొన్ని డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించేందుకు వీలు కల్పించే అవకాశం ఉన్న డిజిటల్ చెల్లింపుల నియంత్రణ సవరణ బిల్లును లోక్సభ ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి డిజిటల్ చెల్లింపులపై ఛార్జీల బాదుడు మొదలవుతుందా? జేబులకి చిల్లు పడక తప్పదా? అనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ మొదలైంది.
Also Read: గ్రేటర్ హైదరాబాద్లో డేంజర్ బెల్స్.. లక్షలాది ఓట్లకు కత్తెర పడటం ఖాయమా..?
అయితే చిన్న తరహా వ్యక్తిగత చెల్లింపులకు ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఎప్పుడు ఛార్జీల వాత పెడతాయోననే భయం డిజిటల్ వినియోగదారులను నీడలా వెంటాడుతోంది. ఒకవేళ ఛార్జీలు, పన్నుల భారం పెరిగితే.. ఇన్నాళ్లూ డిజిటల్ వైపు అడుగులు వేసిన జనం, ఛార్జీల భయంతో మళ్లీ పాత రోజుల్లా ఏటీఎంల ముందు క్యూ కట్టి డబ్బులు డ్రా చేసి మళ్లీ పర్సులో మనీ మెయింటైన్ చేస్తారా? రూపాయి చెల్లించాలన్నా పన్ను కట్టాల్సిన పరిస్థితి వస్తే భారతదేశంలో డిజిటల్ ఇండియా డ్రీమ్ దెబ్బతింటుందా?
Also Read: హామీలు నీ వల్ల కాదు.. కేసీఆర్ ఇచ్చినవి ఇస్తే చాలు.. ఈటల మార్క్ పొలిటికల్ స్ట్రైక్!