Congress Dissent: కాంగ్రెస్లో కమిటీలు వచ్చాయి. కానీ కమిటీలతో పాటు అసంతృప్తులు కూడా బయటకు వచ్చాయి. నిన్నగాక మొన్న వేసిన సోషల్ మీడియా కమిటీలు గాంధీ భవన్లో కొత్త లొల్లిని గిల్లి లేపాయి. పార్టీని నమ్ముకుని, కష్టపడిన వారికి గుర్తింపు లభించడం లేదన్న అసంతృప్తి నేతల్లో ఒక్కసారిగా బయటపడింది. తాజాగా వేసిన సోషల్ మీడియా కమిటీలో తనకు ఇచ్చిన పదవిని తిరస్కరిస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా కన్వీనర్ గీత ఐనల సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
Also Read: గ్రేటర్ హైదరాబాద్లో డేంజర్ బెల్స్.. లక్షలాది ఓట్లకు కత్తెర పడటం ఖాయమా..?
పాత నాయకులను పట్టించుకోవడం లేదనే ఆగ్రహం కాంగ్రెస్లో శ్రేణుల్లో కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన వారికి, తమ వారికే పదవులు కట్టబెడుతున్నారనే భావన శ్రేణుల్లో పెరిగిపోతోంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచిపోయినా ఆశావహులకు మాత్రం పదవుల నిరీక్షణ తప్పడం లేదు. నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యమవుతున్న వేళ, తాజా కమిటీల రచ్చతో గాంధీ భవన్లో అసంతృప్తి జ్వాలలు ఏ స్థాయికి చేరుకుంటాయో చూడాలి.
Also Read: హైడ్రా ఎంట్రీతో షాక్లో కాలేజీల యాజమాన్యాలు.. వెలుగులోకి బిగ్ స్కామ్స్!