Fake NOCs: కాలేజీలు ఫైర్ సెఫ్టీ ఫార్మాలిటీస్ పాటిస్తూ ప్రభుత్వం నుంచి NOC తీసుకోవాలి. కానీ కొన్ని కాలేజీలు ఫేక్ NOCలు తెచ్చుకున్నాయి. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు. ఈ వ్యవహారం బయటపడగానే 53 ఇంటర్ కాలేజీలకు నోటీసులు వెళ్లాయి. మాకేమీ తెలియదు. ఏజెంట్లు ఇచ్చారని కాలేజీ యాజమాన్యాలు చేతులేత్తేస్తున్నాయి. ఏటా లక్షల రూపాయలు ఫీజులు తీసుకునే కాలేజీలకు NOC అసలైనదో కాదో చూసుకునే కనీస జ్ఞానం లేదా? ఇది కేవలం అజ్ఞానం కాదు. భద్రతా పరికరాలు అమర్చకుండా డబ్బులు మిగుల్చుకోవడానికి ఆడిన క్రూరమైన నాటకం.
Also Read: ఏపీలో ముదిరిన భద్రతా రాజకీయం.. అమిత్ షా వద్ద వైఎస్ జగన్ సెక్యూరిటీ వివాదం!
అసలు ఈ నకిలీ పత్రాలు ఎవరు తయారు చేశారు? ఎక్కడ తయారయ్యాయి? ఎవరి సహకారంతో అధికారిక రికార్డుల్లోకి చేరాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది జీహెచ్ఎంసీ. ఇంత పెద్ద ఎత్తున నకిలీ పత్రాలు, సర్వర్లోని లొసుగులు వాడుకుని సీరియల్ నంబర్లతో సహా NOCలు బయటికొచ్చాయంటే.. జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖల్లోని ఇంటి దొంగల ప్రమేయం లేకుండా సాధ్యం కానేకాదు. మరి ఆ ఇంటిదొంగలు ఎవరు.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదు.
Also Read: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ ఛార్జీలపై నిపుణులు చెబుతున్న నిజాలివే!