E-Paper
Advertisement

తమిళనాడు అసెంబ్లీలో.. సీఎం విజయ్ సంచలన ప్రకటనలు

తమిళనాడు అసెంబ్లీలో.. సీఎం విజయ్ సంచలన ప్రకటనలు
Advertisement

Vijay Schemes: తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. అసెంబ్లీ వేదికగా కీలక సంక్షేమ పథకాలను ప్రకటించారు. మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. పేద కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనున్నట్లు తెలిపారు. అలాగే రైతుల వ్యతిరేకతతో.. పరందూర్‌ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

అక్టోబర్ 2 గాంధీ జయంతి..

మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో.. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వెట్రి పయనం పేరుతో విస్తరించారు. వచ్చే అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. మెట్రో పాలిటన్, పట్టణ ప్రాంతాల్లోని ఎక్స్‌ప్రెస్, ఎల్‌ఎస్‌ఎస్, డీలక్స్ బస్సుల్లో.. మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. సబర్బన్, కొండ ప్రాంతాల్లో తిరిగే సాధారణ ఛార్జీల బస్సులకూ ఇది వర్తిస్తుంది. ఈ పథకానికి ఏటా 6 వేల కోట్ల అదనపు భారం పడనుంది.

Advertisement

Also read: ‘యువతులను ట్రాప్ చేస్తున్నారు’.. ఏపీ ప్రభుత్వానికి రాజాసింగ్ కీలక హెచ్చరిక

ఏటా 4 వేల కోట్ల భారం..

అయితే, వార్షిక ఆదాయం రెండున్నర లక్షల్లోపు ఉన్న కోటి 30 లక్షల కుటుంబాలకు.. ఏడాదికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందించనున్నారు. వీటి కొనుగోలు మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తారు. వచ్చే పొంగల్ నుంచి ప్రారంభం కానున్న ఈ పథకానికి.. ప్రభుత్వ ఖజానాపై ఏటా 4 వేల కోట్ల భారం పడనుంది. ఇక, రైతులు, స్థానిక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. పరందూర్‌లో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రజలు నిరాశ్రయులు కాకుండా.. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో కొత్తగా టెర్మినల్-5ను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

Also Reda: కొండా సురేఖ వివాదంపై.. పరోక్ష సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్!

Tags

Related News

తెలంగాణ ఎమ్మెల్సీ పోరులో జనసేన.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

కొండా సురేఖ వివాదంపై.. పరోక్ష సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్!

తమ్ముడికి చెక్ పెట్టేందుకు అన్నకు ప్రాధాన్యం.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

అంజయ్యనగర్‌లో మరో 5 అక్రమ భవనాలు గుర్తింపు.. రంగంలోకి హైడ్రా, సీఎమ్‌సీ!

జెన్ జీ ఓటర్లను ఆకర్షించేందుకు కమలం స్కెచ్.. ఫీజు పోరుతో రోడ్డెక్కిన BJYM!

నెక్స్ట్ వికెట్ ఎవరిది.. కారుమూరి అరెస్ట్‌తో వైసీపీ నేతల్లో మొదలైన టెన్షన్!

డేంజర్ జోన్‌లో 40 మంది ఎమ్మెల్యేలు.. చంద్రబాబు క్లాస్‌తో తమ్ముళ్లలో వణుకు!

Big Stories

Advertisement
×