E-Paper
Advertisement

జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?

జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?
Advertisement

తెలంగాణలో జ‌నసేన త‌న పొలిటిక‌ల్ గ్రాండ్ ఎంట్రీకి గ్రాడ్యుయేష‌న్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను కీల‌కంగా తీసుకుంటున్న‌దా…? బీజేపీతో పొత్తు లేకుండా ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌డం ద్వారా ఇక్క‌డి యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్ ఎంత ఉందో తెలియ‌జేసేందుకు ఖమ్మం- న‌ల్గొండ‌- వ‌రంగ‌ల్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌తనిస్తుందా? అంటే అవున‌నే చెప్పాలి. అంద‌రికంటే ముందు ఇక్క‌డ అభ్యర్థిని ప్రక‌టించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అప్పుడే కార్య‌రంగంలోకి దిగి గెలుపు వ్యూహాల‌ను ర‌చిస్తుండ‌టం పొలిటిక‌ల్ చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

గ‌డ‌ల శ్రీ‌నివాస్ ఎంపిక‌తో చ‌ర్చ‌..

ఖ‌మ్మం- న‌ల్గొండ‌- వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీ స్థానం నుంచి గ‌డ‌ల శ్రీ‌నివాస్‌ను అభ్య‌ర్థిగా ఖ‌రారు చేసింది జ‌న సేన పార్టీ. పార్టీ అధికార ప్ర‌తినిధిగా కొన‌సాగుతున్న శ్రీ‌నివాస్‌.. గ‌తంలో హెల్త్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన అనుభవం ఉంది. క‌రోనా స‌మ‌యంలో కూడా అత‌ను స‌ర్వీసులో ఉన్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఈ మూడు ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలోని యువ‌త‌, ప్ర‌జ‌ల‌తో ఉన్న సంబంధాలు పార్టీకి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అధిష్టానం భావిస్తోంది.

బీజేపీతో పొత్తుకు ప్ర‌య‌త్నం..

Advertisement

తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీతో పొత్తు పెట్టుకోవాల‌ని బీజేపీ భావించింది. కానీ ప‌వ‌న్ ఓవ‌రాక్ష‌న్ వ‌ల్ల బీజేపీ వెన‌క్కి త‌గ్గింది. తెలంగాణ‌లో త‌న‌ను అడుగు పెట్ట‌నీయ‌కుండా చేస్తున్నారని, మీ య‌బ్బ జాగీరా అనే అనుచిత వ్యాఖ్య‌లు ఆ పార్టీకి మేలు చేసేవిగా కాకుండా మ‌రింత గ్యాప్‌నే పెంచాల‌ని చెప్పాలి. ఈ క్ర‌మంలో బీజేపీ జాతీయంగా తీసుకున్న పాల‌సీ మ్యాట‌ర్‌లో భాగంగా ఒంట‌రి పోరుకే ముందుకు పోతామ‌ని ప్ర‌క‌టించడంతో .. ప‌వ‌న్ సైతం ఒంట‌రిగా బరిలోకి దిగాడు. గ్రాడ్యుయేష‌న్ ఎన్నిక‌ల ద్వారా యువ‌త‌లో ఉన్న క్రేజ్‌ను అందిపుచ్చుకుని త‌న స‌త్తా చాటాల‌ని భావిస్తున్నారాయ‌న‌.

Also Read: తండ్రి చాటు బిడ్డగానే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి! దామోద‌ర‌రెడ్డి డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్?

ఎమ్మెల్యే టికెట్ కోసం బీఆరెస్‌లో చేరి..

Advertisement

జ‌న‌సేన ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన గ‌డ‌ల శ్రీ‌నివాస్ గ‌తంలో బీఆరెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్త‌గూడెం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. ఆ త‌రువాత ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ యాక్టివ్ కానుంద‌నే సంకేతాలు అందుకున్న ఆయ‌న ప‌వ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. ఆ వెంట‌నే ఆయ‌న‌ను పార్టీ అధికార ప్ర‌తినిధిగా నియ‌మిస్తూ ప‌వ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. శ్రీ‌నివాస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌నే వ్యూహంతోనే జ‌న‌సేన‌లో చేరిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఆయ‌న ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఇది ఇరువురికి ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా మారింది.

– Written by Dandugula Srinivas, BIG TV

Tags

Related News

బాల్కొండ బ‌రి నుంచి మ‌హేశ్‌? మ‌రి ఆ న‌లుగురి ప‌రిస్థితి? ఇందూరు కాంగ్రెస్‌లో ర‌చ్చ రాజ‌కీయం!

రాజ‌కీయాల్లో ర‌ఘువీరా మ‌ళ్లీ యాక్టివ్.. పార్టీకి పూర్వవైభవం తెస్తారా?

మేమే వ‌స్తామంటే మేమే వ‌స్తాం..! వెయ్యి రోజుల పాల‌న‌పై బీఆరెస్ పోరాటం.. మేమే మ‌రో ప‌దేళ్లంటున్న స‌ర్కార్‌..

తండ్రి చాటు బిడ్డగానే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి! దామోద‌ర‌రెడ్డి డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్?

కవిత పార్టీలో ఆ ఇద్దరు సీనియర్ నేతలు ఎక్కడ.. అసలు ఉన్నట్టా లేనట్టా..?

పాడిపై ఎథిక్స్ వేటు.. చర్య‌లు తీసుకోవ‌డ‌మే త‌రువాయి.. దుందుడుకు, వివాద‌స్ప‌ద నేతకు ఇదే స‌రైన చర్యా..?

ఎచ్చెర్ల ఇన్‌చార్జ్‌ పదవిపై టీడీపీలో లొల్లి.. రేసులో నలుగురు

Big Stories

Advertisement
×