Raghuveera: అప్పుడు ఆయన కింగ్. పరిస్థితులు తారుమారైనా కింగ్ మేకర్గా తన సత్తా చాటుకుంటున్నారు. ఏపీ పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి అంతంత మాత్రంగానే ఉన్నా.. తన సొంత నియోజకవర్గంలో మాత్రం ఆ సీనియర్ నేత తన పట్టును కొనసాగిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ బరిలో ఉంటే చాలు.. ఎవరి కొంప ముంచుతుందా? అని ప్రత్యర్థులు హడలిపోతారు.. ఎవరా నేతా..? ఏమా కథా..??
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి పొలిటికల్ ట్రాక్ రికార్డ్ కొంచెం డిఫరెంట్. ఆయన రాజకీయాల్లో ఉత్థానపతనాలు చూశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అలంకరించారు. పార్టీ పరిస్థితి దారుణంగా పడిపోయినప్పుడు తన నియోజకవర్గానికే పరిమితమైనా.. అక్కడ తన ప్రభావాన్ని చాటుకుని పార్టీ బలాన్ని కొనసాగిస్తున్నారు.
సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో రఘువీరారెడ్డి రాజకీయమే నడిచేది. వరుసగా ఆయన అక్కడ్నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కీలక మంత్రి పదవులు కూడా చేశారు. ఆ తరువాత ఈ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వ్ కోటా కింద మారడంతో పక్కనే ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసినా.. ఆయన పట్టంతా మడకశిరలోనే ఉంది. అక్కడ తనకున్న పట్టును నిలుపుకుంటూ.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వస్తున్నారు.
Also Read: వైసీపీకి విజయసాయిరెడ్డి సంచలన లేఖ.. సజ్జల నాపై దాడి చేశారంటూ సంచలన ఆరోపణలు!
మడకశిరలో కాంగ్రెస్ అభ్యర్థి ఘననీయమైన ఓట్లు సాధిచడం వల్ల టీడీపీ, వైసీపీల గెలుపోటములపై ప్రభావం చూపుతున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుతోంది కాంగ్రెస్. ఈ పరిణామం గతంలో టీడీపి మెజారిటీని భారీగా తగ్గించింది. ఇప్పుడు వైసీపీ గెలుపు అవకాశాలకు కూడా గండి కొట్టేలా ఉందంటున్నారు విశ్లేషకులు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇక్కడ ఉనికి చాటుకునేలా ఉందంటున్నారు. రఘువీరా కూడా ఇప్పుడు రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యారు. ఆయనను అధిష్టానం సీడబ్ల్యూసీ మెంబర్గా నియమించడంతో మరింత బాధ్యత మరింత పెరిగింది పార్టీలో. మరి రఘువీరా పార్టీకి పూర్వ వైభవం తెస్తారో లేదో చూడాలి.