Nepal Floods: నేపాల్లో సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ చిక్కుకున్న లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.
నేపాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అక్కడ ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్లైన్ మరియు సమన్వయ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేపాల్లో ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో పాటు ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు.
Also read: ఆర్ఎస్ఎస్ కార్యక్రమంపై న్యూయార్క్ మేయర్ మమ్దానీ అభ్యంతరం..కారణం అదేనట!
నేపాల్లో ఉన్న తెలంగాణకు చెందిన యాత్రికులు, పర్యాటకులు లేదా ఇతర వ్యక్తులతో సంప్రదింపులు జరపలేకపోతున్న కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్లైన్ను సంప్రదించవచ్చు. సహాయక చర్యల సమన్వయాన్ని సులభతరం చేసేందుకు సంబంధిత వ్యక్తుల పేరు, పాస్పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్లో ప్రస్తుతం ఉన్న లేదా చివరిగా తెలిసిన ప్రాంతం, ట్రావెల్/టూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలను హెల్ప్లైన్ అధికారులకు అందించాలి.
శ్రీమతి వందన
పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్
మొబైల్: 9871999044
సి.హెచ్. చక్రవర్తి
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
మొబైల్: 9949351270
జి. రక్షిత్ నాయక్
లైజన్ ఆఫీసర్
మొబైల్: 9618597969