Nalgonda Pollution: చీకటి పడితే చాలు.. ఆ పల్లెల్లో మరణ మృదంగం మోగుతోంది. కంటినిండా నిద్రపోవాల్సిన వేళ గొంతులో మంట, కళ్లల్లో నీళ్లు, ఊపిరి సలపని ఆందోళన ఆ గ్రామాల ప్రజలను వెంటాడుతోంది. దమ్ముంటే ఒక్కరాత్రి మా ఊళ్లో పడుకోండని అధికారులనే సవాల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామాల్లో ఏం జరుగుతుంది. ఆ గ్రామస్తులను వెంటాడుతున్న సమస్య ఏంటి?
పచ్చని పల్లెల్లో రాత్రయితే చాలు పీల్చే గాలి దొరక్క ప్రాణాలు విలవిలలాడుతాయి. ఇది నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని గ్రామాలకు శాపంగా మారిన భయానక నిజం. వెలిమినేడు, ఆరేగూడెం, పెద్దకాపర్తి గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నాయి. పచ్చని పైర్లతో కలకలలాడాల్సిన భూములు రసాయనాల ఘాటుకు మాడిపోతున్నాయి. ఆరేగూడెం సమీపంలో ఉన్న డీఎన్ఎస్ గ్రీన్ ఎన్విరోస్ సంస్థకు పలు ఫార్మా కంపెనీల నుంచి నిత్యం కెమికల్ వేస్ట్ తరలిస్తున్నారు.
Also Read: అనసూయపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. ఛీ అవేం మాటలు?
దీన్ని రాత్రి కాగానే ప్రధాన రహదారులపై పారబోస్తున్నారు. అసలు ఈ కంపెనీలకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ ఊళ్లకి ఊళ్లే నిలదీస్తున్నాయి. తాము చెబుతున్నది అబద్ధమనిపిస్తే కలెక్టర్ అయినా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులైనా సరే కనీసం ఒక్క రాత్రి మా ఊరికి వచ్చి నిద్రపోండి అంటూ సవాల్ విసురుతున్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా అధికారులు యాక్షన్ తీసుకుంటారా?
Also Read: కర్ణాటక కాలేజీల్లో హెచ్ఐవీ బాంబ్.. 7,000 మంది విద్యార్థులకు పాజిటివ్..!