Ward Reorganisation: వైజాగ్ సిటీ వేగంగా ఎక్స్పాండ్ అవుతుండటంతో వార్డులను రీ-ఆర్గనైజ్ చేయడం ఆఫీసర్లకు తప్పనిసరిగా మారింది. ఇందులో భాగంగానే ప్రస్తుతమున్న 98 వార్డులను 120కి పెంచుతూ జీవీఎంసీ ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఈ ప్రతిపాదనపై లోకల్ పబ్లిక్, పొలిటికల్ లీడర్స్ నుంచి భారీగా సజెషన్స్ వచ్చాయి. గడువు ముగిసే సమయానికి దాదాపు 1,500 దరఖాస్తులు అధికారుల టేబుల్పైకి చేరాయి.
అందిన అప్లికేషన్లలో 90 శాతానికి పైగా ఒకే మేజర్ డిమాండ్ కనిపిస్తోంది. విశాఖపట్నం పాపులేషన్, జాగ్రఫికల్ ఏరియాకు తగినట్లు వార్డుల సంఖ్యను 120 కాకుండా 150కి పెంచాలని ప్రజలు బలంగా కోరుతున్నారు. వార్డు పరిధి పెద్దదిగా ఉంటే డెవలప్మెంట్ పనులకు, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియెన్స్కు ఇబ్బంది అవుతుందనేది వారి ప్రధాన అభిప్రాయం.
Also read: మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!
ఇక నియోజకవర్గాల వారీగా డేటా చూస్తే విశాఖ వెస్ట్ నుంచే రికార్డు స్థాయిలో 909 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈస్ట్ నియోజకవర్గం నుంచి 400, సౌత్ నుంచి 6, భీమిలి అండ్ మధురవాడ జోన్స్ నుంచి చెరో 5 దరఖాస్తులు అందాయి. అయితే అనకాపల్లి ఏరియా నుంచి ఒక్క ఆబ్జెక్షన్ కూడా రాలేదు.
ప్రజల నుంచి వచ్చిన ఈ వినతులన్నింటినీ అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. దీనిపై పరిశీలనలు, చర్చలు, డెసిషన్ల తర్వాత ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ అప్రూవల్ వస్తే.. ఈ నెల 14న వార్డుల పునర్విభజనపై అఫీషియల్ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈ నోటిఫికేషన్ లో విశాఖ పబ్లిక్ కోరినట్టు 150 వార్డులను పెంచుతూ ప్రకటన ఉంటుందా? లేదా చూడాలి.
Also read: మగవాళ్లే చీర కట్టుకుని అలాంటి దందాలు.. అదిలాబాద్లో ట్రాన్స్జెండర్ల ఆవేదన!