Dimaagi Naxals: అప్పట్లో అర్బన్ నక్సల్స్.. రీసెంట్గా మావోయిస్టు ముక్త్ భారత్. డెడ్ లైన్ విధించి ఆపరేషన్ను సక్సెస్ చేసింది కేంద్రం. పంద్రగాస్టు వేదికగా ప్రధాని దిమాగీ నక్సల్స్ ను టార్గెట్ చేశారు. ఎవరీ దిమాగీ నక్సల్స్.? అడవుల్లో మావోయిస్టు వ్యవస్థ తుడిచిపెట్టుకుపోయినా సరే ఇంకా కొంతమంది ఆ భావజాలాన్ని పట్టుకు వేలాడుతున్నారన్నారు.
ఆయుధాలు పట్టరు కానీ చాపకింద నీరులా నకల్స్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తారు. అలాంటి వాళ్లకు చెక్ పెట్టాలని ఎర్రకోట నుంచి సమాజానికి సందేశం ఇచ్చారు ప్రధాని మోదీ. దిమాగీ నక్సల్స్ వివిధ వ్యవస్థల్లోకి చేరి మళ్లీ హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు ప్రధాని. దిమాగీ నకల్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లుపై అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.
Also read: మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో దారుణం.. ప్రసవం కోసం వస్తే గాంధీ ఆస్పత్రికి రిఫర్..!
నాకు ఎలాంటి క్రెడిట్ వద్దు. కావాలంటే ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. మహిళసాధికారతకు చేయూతనిచ్చే బిల్లును పాస్ చేసేందుకు సహకరించాలని విపక్షాలకు అప్పీల్ చేశారు ప్రధాని మోదీ. గత 40 ఏళ్లుగా మహిళలు ఎదురుచూస్తోన్న రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు.పార్లమెంట్లో.. అసెంబ్లీల్లో నారీశక్తి ప్రాధాన్యత పెరిగితే అది దేశానికి.. భవిష్యత్కు మంచిదన్నారు.
Also Read: తెలంగాణ రేషన్ కార్డుల్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాని ఫొటో వివాదం వెనుక అసలు నిజాలివే!