Smart Ration Cards: రేవంత్ సర్కార్ ఇచ్చిన మాటప్రకారం 3 కోట్ల 40లక్షల మందికి సర్కార్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. పంద్రాగస్టు సందర్భంగా కోటి స్మార్ట్కార్డులను పంపిణీ చేశారు. నకిలీలు వంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా స్మార్ట్ కార్డులను రూపొందించారు. ఐతే ఇప్పుడు తెలంగాణ రాజకీయం స్మార్ట్ రేషన్కార్డు వైపు టర్న్ తీసుకుంది.
ఉచిత రేషన్లో ఐదు కిలోలు కేంద్రం కూడా ఇస్తోంది కదా. మరి స్మార్ట్ కార్డులో ప్రధాని ఫోటో ఎందుకు ముద్రించలేదని బీజేపీ నేతలు గద్దించారు. ప్రధాని మోదీ ఫోటో వేయాల్సిందే, లేదంటే స్మార్ట్రేషన్ కార్డులను అడ్డుకుంటామని ఎంపీ రఘునందన్ అల్టిమేటమ్ ఇచ్చారు. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఘాటు విమర్శలుచేశారు. కాంగ్రెస్ది తుమ్మతే పడిపోయేసర్కార్ అని ఎద్దేవా చేశారాయన. ప్రజాధనం దుర్వినియోగం కావడమే తప్ప స్మార్ట్ కార్డులు ఎందుకూ పనికిరావన్నారు.
Also read: హైదరాబాద్లో మైండ్ బ్లాకింగ్ ఫ్రాడ్.. రూ. 10 కోట్ల ఆస్తులు స్కామ్ చేసిన కేటుగాడు!
ప్రభుత్వం మారితే స్మార్ట్ కార్డులు పనైపోతుందన్నారు. సామాన్యులకు చేయూతనిచ్చే స్మార్ట్ రేషన్ కార్డుపై రాజకీయ రాద్దాంతం సరికాదన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రొటోకాల్ ఉల్లంఘణ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టడం సగర్వంగా వుందన్నారు. రేషన్లో 78 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఇందులో కేంద్రం వాటా చాలా చిన్నదన్నారు. పైగా స్మార్ట్కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ప్రింట్ చేసేవి కాబట్టే వాటిపై ప్రధాని ఫొటోలు పెట్టలేదని క్లారిఫై చేశారు మంత్రి ఉత్తమ్.
Also read: పంద్రాగస్టు వేళ రచ్చ లేపిన మల్లారెడ్డి.. వైరల్ అవుతున్న మాజీ మంత్రి స్పీచ్!