E-Paper
Advertisement

No Confidence Motion result: వీగిన అవిశ్వాస తీర్మానం.. మోదీ ఫినిషింగ్ టచ్..

No Confidence Motion result: వీగిన అవిశ్వాస తీర్మానం.. మోదీ ఫినిషింగ్ టచ్..
No Confidence Motion live updates

No Confidence Motion live updates(Parliament session today news):

అనుకున్నట్టే అయింది. లోక్‌సభలో విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. ఓటింగ్ సందర్భంగా ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి.

అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ రెండు గంటలకు పైగా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ప్రతిపక్షాలపై ఫోర్లు, సిక్సులతో ఓ ఆట ఆడుకున్నారు. కాంగ్రెస్ చరిత్ర మొత్తం తవ్విపోశారు. మణిపూర్‌పైనా తనదైన శైలిలో విమర్శలు, వివరణ ఇచ్చారు మోదీ.

మణిపూర్‌లో జరిగింది దిగ్భ్రాంతికరం, అమానవీయమన్న మోదీ.. మణిపూర్‌ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. కొందురు ఎందుకు భారతమాత చావు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదని రాహుల్‌కు కౌంటర్ వేశారు. వీళ్లు దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

1966లో మిజోరం ప్రజలపై ఎయిర్‌ఫోర్స్‌తో దాడులు చేయించారని.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని నెహ్రు అడ్డుకున్నారని చెప్పారు. మణిపూర్‌లో సాయంత్రం నాలుగు తర్వాత గుడులు, మసీదులు మూసేసి.. సైన్యం పహారా కాసేదని.. ఆ పాపం కాంగ్రెస్‌ది కాదా? అని నిలదీశారు. తాను ఇప్పటికి 50సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించానని మోదీ అన్నారు.

మణిపూర్‌లో విధ్వంసాలన్నీ కాంగ్రెస్‌ హయాంలో జరిగినవేనని తెలిపారు. మణిపూర్‌ అభివృద్ధికి ఎన్డీఏ తీవ్రంగా కృషి చేస్తోందని.. మణిపూర్‌, నాగాలాండ్‌, మిజోరంలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్‌ చూడలేకపోతోందని మండిపడ్డారు మోదీ.

INDIA ను I.N.D.I.A గా ముక్కలు చేశారని.. యూపీఏ ముగిసిన అధ్యాయమని.. మూలనపడిన ఆ బండికి రంగు వేసి ఇండియాగా మార్చేశారని ఎద్దేవా చేశారు. తమ NDAకు రెండు I లు చేర్చి INDIA పేరుతో 16 పార్టీలు ఏకమయ్యాయని.. అందులో అందరూ ప్రధాని కావాలని అనుకుంటారని ఎద్దేవా చేశారు.

తమిళనాడు, బెంగాల్‌, త్రిపుర, ఒడిశా రాష్ట్రాల్లో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ ఓడిపోతూనే ఉందని.. ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని.. కాంగ్రెస్ పని ఖతం అంటూ పంచ్‌లు వేశారు ప్రధాని మోదీ.

కాంగ్రెస్‌ను ప్రశ్నించినందుకు అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ది అన్నారు. ఎమర్జెన్సీని ప్రశ్నించినందుకు జగ్జీవన్‌రామ్‌ను ఓడించారని.. జయప్రకాశ్‌ నారాయణ, మొరార్జీ దేశాయ్‌లాంటి ఎంతోమంది నాయకులను కాంగ్రెస్‌ ఓడించే ప్రయత్నం చేసిందని..చరిత్ర గుర్తు చేశారు.

ఆస్పత్రులు, రహదారులు, అవార్డులకు వారి పేర్లే ఉంటాయని.. కానీ ఆస్పత్లో చికిత్స ఉండదని.. కొత్త రోడ్లు వేయరని.. పరోక్షంగా గాంధీ కుటుంబాన్ని కార్నర్ చేస్తూ మాట్లాడారు ప్రధాని. మూడు రంగుల జాతీయ జెండాను.. కాంగ్రెస్‌ జెండాగా మార్చుకుందని తప్పుబట్టారు.

Tags

Related News

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

Big Stories

×