E-Paper
Advertisement

కర్నూలు జిల్లాలో అక్రమ తవ్వకాల కలకలం.. సీలింగ్ ల్యాండ్స్ నుంచి జోరుగా ఎర్రమట్టి దందా..!

కర్నూలు జిల్లాలో అక్రమ తవ్వకాల కలకలం.. సీలింగ్ ల్యాండ్స్ నుంచి జోరుగా ఎర్రమట్టి దందా..!
Advertisement

Red Soil Mafia: మట్టి మాఫియాకు అడ్డాగా మారింది కర్నూలు జిల్లాలోని హోళగుంద మండలం. ఈ మండలంలోని నెరనికి, చిన్న హ్యాట గ్రామాల సమీప కొండల్లో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూ ఆపు లేకుండా పోయింది. రాత్రి, పగలు తేడా లేకుండా రోజూ 10 టిప్పర్‌లు, 4 జేసీబీలతో వందల టన్నుల ఎర్రమట్టి విండ్ టర్బైన్ కంపెనీలకు తరలిపోతోంది. తవ్వకాలు జరుపుతున్న భూమి.. సీలింగ్ ల్యాండ్ అని.. ఇక్కడ మట్టిని తవ్వితే పట్టాలు రద్దు చేస్తామని రైతులకు లోకల్ ఎమ్మార్వో లక్ష్మిరాజ్ హెచ్చరించారు. వార్నింగ్‌లకే పరిమితం కాలేదు. ఓసారి మైనింగ్ చేస్తున్న జేసీబీని, డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు ఎమ్మార్వో. కానీ, రాత్రికి రాత్రే ఆ డ్రైవర్ రిలీజ్ అయిపోయాడు. అంటే.. ఈ మాఫియా వెనక బడాబాబులు ఉన్నారని క్లియర్ గా తెలుస్తోంది.

రోడ్డుపై హెవీ లోడ్..

మైనింగ్ కి మాత్రమే కాదు.. మట్టిని తరలిస్తున్న వాహనాలకు కూడా లైసెన్సులు లేవు. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి టిప్పర్లు కర్నాటక వెళ్తున్నా.. కనీసం క్వశ్చన్ చేసేవాళ్లు కూడా లేరు. ఏపీ నిబంధనలకు అనుగుణంగా టాక్స్‌లు చెల్లించకుండా రోడ్డుపై హెవీ లోడ్ టిప్పర్‌లు తిరుగుతున్నాయి.

Advertisement

Also read: పాకిస్తాన్ ప‌త‌నానికి బాబ‌ర్ ఆజం కుట్ర‌లే కార‌ణం…వాడి వ‌ల్లే అంద‌రూ దోషుల‌య్యారు

విలేజర్స్ సీరియస్..

ఈ అక్రమ దందాపై ముద్దనగేరి, కురుకుంద, హెబ్బటం విలేజర్స్ సీరియస్ అవుతున్నారు. గ్రామ నడిబొడ్డున ఇళ్ల ముందు రాత్రిపగలు హెవీ వెహికల్స్ తిరగడంతో రోడ్డు దెబ్బతింటున్నాయి. రీసెంట్‌గా 11 కోట్ల రూపాయలతో వేసిన రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతిన్నదని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ధ్వంసమైన రోడ్లకు ఎవరు మరమ్మతుల చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారు?

కోట్ల రూపాయలు..

Advertisement

ఎర్రమట్టి మాఫియా వల్ల ట్యాక్సుల రూపంలో రావాల్సిన ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు. మైనింగ్ శాఖకు, రెవెన్యూ శాఖకు వెళ్లాల్సిన కోట్ల రూపాయలు బడా బాబుల జేబులను నింపుతున్నాయి. ఇవన్నీ తెలిసినా పొలిటికల్ ప్రెజర్‌తో RTO తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్థుల విమర్శ.

Also read: బహవల్‌పూర్‌లోని ఉగ్ర కేంద్రం మళ్లీ రీ-ఓపెన్.. కేంద్ర హోంశాఖకు సంచలన నివేదిక!

Tags

Related News

చండూరు మార్కెట్ గోదాంలో ప్రభుత్వ ధాన్యం చోరీ కలకలం

పిల్లలను సర్కారు బడికి పంపితే పన్ను మినహాయింపు.. మహబూబాబాద్ జిల్లా గ్రామం కొత్త దారి!

వైసీపీలో పోలిటికల్ వార్.. ఏపీ రాజకీయాల్లో కొత్త కాపు నేతపై ఆసక్తికర చర్చ!

చిన్న పట్టణాల్లో జోరందుకున్న ఉద్యోగాల వేట.. అసలు రహస్యమిదే?

తెలంగాణ కాంగ్రెస్‌కు బీజేపీ చెక్ పెట్టగలదా.. రాంచందర్‌రావుతో భేటీలో బయటపడ్డ కీలక విషయాలివే!

లోకల్ లీడర్‌షిప్ సైలెంట్.. జగన్ ఒంటరి పోరాటం పార్టీకి ప్లస్సా.. మైనస్సా?

22A జాబితా నుండి భూముల తొలగింపు సులువయ్యేనా.. క్షేత్రస్థాయి పరిశీలనలో సర్కార్ నిర్ణయం ఇదే!

Big Stories

Advertisement
×