Kapu Politics: ముద్రగడ పద్మనాభం మరణంతో కాపు రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. ఇప్పుడు ఆయన ప్లేస్ని రీ ప్లేస్ చేయడానికి వైసీపీ నుంచి అంబటి రాంబాబు, టీడీపీ నుంచి బోండా ఉమా పోటీ పడుతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రీసెంట్ డేస్ లో వారి యాక్టివిటీస్, వారి కామెంట్స్ ఈ ప్రశ్నలకు కారణం అవుతున్నాయి. ముద్రగడ సంతాప సభలో చట్టాపట్టాలేసుకున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు.
అంబటి రాంబాబుపై దాడి, కేసులు, అరెస్ట్, బెయిల్ తర్వాత ఆయన కాస్త స్పీడ్ అయ్యారు. ఇదే స్పీడ్ని కంటిన్యూ చేసి ముద్రగడ లేని లోటుని ఫిల్ చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్తో అంబటికి ఉన్న సాన్నిహిత్యం కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉందని కొందరి ఆలోచన. కాపు మార్కుని చూపిస్తూ తన పొలిటికల్ టార్గెట్ని కూడా రీచ్ అవ్వడానికి అంబటికి ఇది మంచి ఛాన్స్ అనే వాళ్లు కూడా ఉన్నారు. అందుకే ముద్రగడతో ఉన్న రాజకీయ సంబంధాలను పదేపదే ఆయన గుర్తు చేస్తున్నారని టాక్.
Also read: చెత్త కుప్పల నుంచి పచ్చని పార్కుగా.. భద్రాచలం గోదావరి కరకట్ట సుందరీకరణ!
ముద్రగడ స్థానాన్ని భర్తీ చేయాలని టీడీపీలో బోండా ఉమా కూడా ప్రయత్నిస్తునట్టు తెలుస్తోంది. రీసెంట్ డేస్లో ఆయన వైసీపీపై ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు. నోరు పారేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. సొంత సామాజిక వర్గం బలాన్ని చూసుకొనే ఆయన ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారని ఓ అంచనా. ఏపీలోని కాపులకు తానే ప్రత్యామ్నాయమని చూపించే ప్రయత్నం ఉమా చేస్తున్నారని అమరావతి సర్కిల్స్లో చర్చ జరుగుతోంది.
ఓ వైపు బోండా, మరోవైపు అంబటి.. ఈ ఇద్దరిలో రేపటి కాపు నేత ఎవరు అవుతారు? ముద్రగడ పద్మనాభం ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తారు? అనుకుంటే ఆ స్థానం వస్తుందా? అనే ప్రశ్నలకు ఫ్యూచర్ ఫాలిటిక్స్ సమాధానం చెబుతాయి.
Also read: మల్లారెడ్డి యూనివర్సిటీలో అపశ్రుతి.. స్పీకర్లు పడి విద్యార్థులకు గాయాలు!