Urooj Mumtaz On Babar Azam: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఆగస్టు 19వ తేదీన ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్.. 103 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వెస్టిండీస్ పై అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ క్రికెటర్లు… ఇంగ్లాండ్ గడ్డపై తేలిపోయారని మండిపడుతున్నారు. ఒక్క బాబర్ ఆజం ఆడకపోతే… ఇంత దారుణంగా ఓడిపోతారా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య తొలి టీ20 జరిగిన నేపథ్యంలో బాబర్ ఆజం సేన పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. అయితే లేటెస్ట్ గా ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ లేడీ క్రికెటర్ ఉరుజ్ ముంతాజ్ ( Urooj Mumtaz Khan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ ఓటమికి బాబర్ ఆజం మూల కారణమంటూ ఆమె బాంబు పేల్చారు. ఒక్కడి కారణంగా… పాకిస్తాన్ ప్లేయర్ లందరూ ఇప్పుడు దోషిగా నిలబడ్డారని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ లో ఫ్లాట్ మైదానాలు అతడు కోరుకున్నాడని… దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ లో పిచ్ లు పీసీబీ సిద్ధం చేసిందని పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్ లో ఉన్న మైదానాలన్నీ బ్యాటింగ్ కు మాత్రమే అనుకూలించాయని వెల్లడించారు మాజీ లేడీ క్రికెటర్ ఉరుజ్ ముంతాజ్.
ఫ్లాట్ పిచ్ లు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ పతనానికి దారి తీసిందని వివాదాస్పద కామెంట్స్ చేశారు ఉరుజ్ ముంతాజ్. ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ బౌలర్లు తేలిపోతున్నారని… దీనంతటికి కారణం బాబర్ ఆజం అంటూ ఫైర్ అయ్యారు. ఒక్కడి స్వార్థం వల్ల… పాకిస్తాన్ క్రికెట్ జట్టు మొత్తం మునిగిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ లేడీ క్రికెటర్ ఉరుజ్ ముంతాజ్ ( Urooj Mumtaz Khan). ఇకనైనా బాబర్ ఆజం లాంటి దద్దమ్మల మాట వినకుండా, విదేశీ గడ్డలపై పాకిస్తాన్ ఆడేలా మైదానాలు సిద్ధం చేయాలని కోరారు.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మొన్న ముగిసింది. కేవలం రెండున్నర రోజుల్లోనే మొదటి టెస్ట్ ముగించేశారు. ఇందులో పాకిస్తాన్ ఓడిపోయింది. అయితే రెండో టెస్టు ఆగస్టు 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ నేపథ్యంలో బాబర్ ఆజం మరోసారి ఆడడం డౌటే అని అంటున్నారు. అతడి వేలు గాయం తగ్గలేదట. దీంతో మరోసారి సల్మాన్ అలీ కెప్టెన్ గా వ్యవహరించే ఛాన్సులు కనిపిస్తున్నాయి.