Kaushal Manda: బిగ్బాస్ తెలుగు సీజన్ 10 లోకి కామన్ మ్యాన్స్ ఎంట్రీ ఇచ్చేందుకు ‘అగ్నిపరీక్ష’అనే ప్రోగ్రాం ద్వారా ఆడిషన్స్ నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ప్రస్తుతం ‘అగ్నిపరీక్ష సీజన్ 2 ‘జరుగుతుండగా దీని చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టేస్తున్నాయ్.
ముఖ్యంగా ఇది అసలు ఆడిషన్స్ లా లేనేలేదని, ఎదుటివారిని అవమానించడానికే ఈ ప్రోగ్రాం పెట్టినట్టుందని నాయుడు,ఉప్పల్ బాలు,రన్నింగ్ రాజా వంటివారు విమర్శించారు కూడా. ఇక ఇందులోనే యాంకర్ శ్రీముఖి చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి కూడా.అయితే ఇదిలా ఉంటే తాజాగా సీజన్ 2 విన్నర్ కౌశల్ మందా చేసిన కొన్ని కామెంట్స్ వాటికి ఆజ్యం పోసేలా ఉన్నాయి.
also read :మార్కెట్లో సంచులు మోసేవాన్ని – ఈశ్వర్ సాయి బ్యాక్ గ్రౌండ్ ఇదే
కౌశల్ మందా మాట్లాడుతూ జడ్జ్ లు కంటెస్టెంట్ ఎలాంటి ప్రెజర్ ని తట్టుకుంటాడు, ఎలా రియాక్ట్ అవుతాడు,కోపం వస్తే ఎలా కంట్రోల్ చేసుకుంటాడు ,అసలు హౌస్ ఉండే సత్తా ఉందా వంటి విషయాలని పరీక్షించడానికి కంటెస్టెంట్ లకి కోపం తెప్పించేలా ప్రవర్తించవచ్చు.
అందులో భాగంగా పోటీదారులకి టాస్క్ లు కూడా ఇవ్వొచ్చు కాని కానీ అది హద్దులు దాటకూడదు అని హెచ్చరించాడు.ముఖ్యంగా బిన్డుమాధవి నాయుడిపై నీళ్ళు కొట్టిన ఘటనని ఉదహరిస్తూ ఎవరూ అలా చేయొద్దని, అలాంటి వాటికంటూ ఒక హద్దు ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఇక అగ్నిపరీక్ష గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు కౌశల్ మందా.అగ్నిపరీక్ష అనేది ముందుగానే ప్లాన్ చేసి ఉంటుందని కాబట్టి బిందుమాధవి కూడా స్క్రిప్ట్ మరియు డైరెక్టర్ చెప్పిన దాన్ని బట్టే చేసి ఉండాలని, కాబట్టి ఇందులో ఆమెని అనడానికి కూడా ఎక్కువ ఆస్కారం లేదని అసలు విషయం చెప్పుకొచ్చాడు.
also read :ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ తో రిలేషన్ ఎప్పటినుండో తెలుసా ?
అయితే బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన వారికి బయటి నుండి ఎలాంటి కనెక్షన్ ఉండదు కాబట్టి లోపల స్క్రిప్ట్ బట్టి చేసేది ఏమీ ఉండదని, అంతా తమ తమ రియాల్టీ లోనే అక్కడ జీవించడానికి ఆస్కారం ఉంటుందని తెలిపాడు. ఇక బిగ్ బాస్ లోకి వెళ్ళినవారెవరు సొసైటీకి ఏదో చేద్దామని, సందేశాలు ఇద్దామని అందులోకి వెళ్ళరని కేవలం పేరు మరియు డబ్బు కోసమే వెళ్తారని కుండబద్దలు కొట్టేశాడు. కౌశల్ మందా !