E-Paper
Advertisement

BJP విందు రాజకీయాల వ్యూహమేంటి?

BJP విందు రాజకీయాల వ్యూహమేంటి?
Advertisement

Telangana BJP: ఇన్నాళ్లూ అంతర్గత పోరుతో సతమతమైన తెలంగాణ బీజేపీలో ఒకేసారి సీన్ మారింది. ఉప్పు నిప్పుగా ఉండే నేతలు కూడా ఒకే డైనింగ్ టేబుల్‌పై విందు భోజనాలు చేస్తున్నారు. అసమ్మతి స్వరాలు వినిపించిన నేతలే ఇప్పుడు ఐక్యత రాగం పాడుతున్నారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంట్లో ఈటల రాజేందర్ ప్రత్యక్షం కావడం, పార్టీ చీఫ్ నితిన్ నబీన్ మీటింగ్ పెట్టి క్లాస్ తీసుకున్న తర్వాత.. నాయకుల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు సడెన్‌గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో బీజేపీ మెయిన్ లీడర్స్‌ అంతా కలిసి భోజనాలు చేశారు.

బీజేపీ నేతల మధ్య సమన్వయం..

Advertisement

గ్రేటర్ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్న గులాబీ, హస్తం పార్టీలను ఢీకొట్టాలంటే.. బీజేపీ నేతల మధ్య సమన్వయం అవసరమే. కానీ కేవలం ఒక విందు భోజనంతో, కొన్ని కెమెరా స్మైళ్లతో ఏళ్ల తరబడి ఉన్న మనస్పర్ధలు తుడిచిపెట్టుకుపోతాయా? తాత్కాలిక అవసరాల కోసం నేతలు కలిస్తే… క్షేత్రస్థాయిలో కష్టపడే కార్యకర్తల్లో విశ్వాసం ఎలా వికసిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఐక్యత పేరుతో దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. కానీ ఈ ఐక్యత.. పోలింగ్ బూత్ వరకు వెళ్తుందా లేదా అన్నదే అసలు ప్రశ్న. మరి ఈ విందు రాజకీయం నిజమైన సమన్వయానికి బాటలు వేస్తుందా? లేదంటే ఎన్నికల వేళ తాత్కాలిక ప్యాచప్‌గా మిగిలిపోతుందా?

Tags

Related News

2 సీట్లు.. 3 పార్టీలు.. పట్టుభద్రుల ఓటు ఎవరివైపు..?

రీల్స్ రాజకీయం ఎంతవరకు వర్కవుట్ అవుతుంది?

బెంగాల్ ఫార్మూలా… గుజ‌రాత్ హ‌మ్లా! ఇక్క‌డున్న‌ది మమ‌త కాదు.. రేవంత్‌..! జాగో తెలంగాణా !

పేదోడికి చార‌ణా.. పెద్దోడికి బారాణా! సంక్షేమ ప‌థ‌కాల తీరిదేనా? అన‌ర్హుల‌కూ ద‌క్కుతున్న ఉచిత ప‌థ‌కాలు.. !

ట్రంప్ టవర్ @ హైదరాబాద్, న్యూయార్క్ రేటులో 8వ వంతుకే!

కేటీఆర్‌కు క‌లిసొచ్చే కాలం.. పెండింగ్ ప‌థ‌కాల‌న్నీ అమ‌లు చేసేయొచ్చు.. తెలంగాణ భ‌వ‌న్ నుంచి!

పవర్ ప్రాబ్లమ్‌కి పర్ఫెక్ట్ చెక్.. 14 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు NPDCL గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×