Aakash Chopra On BAN VS IND : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (bangladesh cricket board) పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా పాకిస్తాన్ మాట విని, ఇండియాను బ్లేమ్ చేసినందుకు.. ఇప్పుడు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియాతో వన్డేల తో పాటు టి20 లో ఆడితే తప్ప, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు ఆదాయం వచ్చేలా కనిపించడం లేదు. ఇండియాతో వన్డే లతోపాటు టి20 లో వాడతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, బీసీసీఐ ( BCCI) అదే సమయంలో మోడీ ప్రభుత్వం దిగి రావడం లేదు.
ఇండియాతో వన్డేలతో పాటు టి20 లు వాడతామని చెబుతున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై (bangladesh cricket board) తాజాగా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ( Akash Chopra) కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు తీసుకున్న గోతిలో మీరే పెట్టారు అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ను హేళన చేస్తూ మాట్లాడారు. 2026 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా ఇండియాకు రమ్మంటే భద్రత కారణాలు చెప్పి.. బంగ్లాదేశ్ తప్పించుకుందని మండిపడ్డారు. అనవసరంగా పాకిస్తాన్ వాడి మాటలు విని… ఇండియాను అంతర్జాతీయంగా దోషిగా చూపించే ప్రయత్నం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చేసిందని నిప్పులు చెరిగారు.
అలాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చిందని మండిపడ్డారు. మీకు భద్రతా సమస్యలు వచ్చినప్పుడు, మాకు కూడా అవే సమస్యలు తలెత్తుతాయి కదా? అంటూ నిలదీశారు. బంగ్లాదేశ్ లో టీమిండియా పర్యటిస్తే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుందని తెలిపారు. బంగ్లాదేశ్ లో టీమిండియా ప్లేయర్లు పర్యటిస్తే ఖచ్చితంగా భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని, పేర్కొన్నారు. గతంలో మీరు చెప్పిన కారణం తోనే.. ఇప్పుడు మేము బంగ్లాదేశ్ లో పర్యటించబోమని కుండబద్దలు కొట్టి చెప్పారు. బంగ్లాదేశ్ తో ఆడితే దేశ ద్రోహమేనని, ఆకాశ్ చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా ఇండియా తరఫున నిలబడి, తమ దేశానికి వచ్చి ఉంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పరిస్థితి మరోలాగా ఉండేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా పాకిస్తాన్ వాడి మాటలు విని ఇప్పుడు బొక్క బోర్లా పడ్డారని హేళన చేశారు. కష్టాలు వచ్చినప్పుడు మీకు అన్నం పెట్టింది బీసీసీఐ అన్న విషయం మర్చిపోయి కూడా… శత్రువు పాకిస్తాన్తో చేతులు కలపడం ఏమాత్రం సమంజసం అంటూ నిలదీశారు. ఇక ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇండియా గుర్తుకు వచ్చిందా ? అని నిలదీశారు.