Cabinet Expansion: ప్రస్తుత పీసీసీ చీఫ్ కేబినెట్ లోకి వెళ్లడం ఖాయమనే చర్చ పార్టీలో ఉన్నది. అయితే తనకు బెర్త్ తో పాటు డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే కేబినెట్ లోకి వెళ్తానని, లేదంటే పీసీసీ చీఫ్ గానే కొనసాగుతానని మహేష్ కుమార్ గౌడ్ హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టినట్లు తెలిసింది. హైకమాండ్ పూర్తి స్థాయిలో అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకోనున్నది. కేబినెట్ బెర్త్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమాండ్.. డిప్యూటీ సీఎం పదవి క్లియరెన్స్ కు అధ్యయనం చేస్తున్నది. పార్టీ, ప్రభుత్వంలోని ముఖ్యలతో ఏఐసీసీ పెద్దలు డిస్కషన్ చేస్తున్నారు. రాజకీయ, కుల సమీకరణాలు ఆధారంగా ఈ పదవిని నిర్ణయించనున్నట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి దాదాపు మూడేళ్లు సమీపిస్తున్నా.. నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవుల పంపకంపై ఉత్కంఠ వీడటం లేదు. ఈ నేపథ్యంలో ఈ దఫా అన్ని పదవులు పూర్తి చేయాలని హైకమాండ్ భావిస్తున్నది. మరోవైపు పీసీసీ చీఫ్ కేబినెట్ లోకి వెళ్తే, తనకు పీసీసీ చీఫ్గా అవకాశం ఇవ్వాలని ఎంపీ బలరామ్ నాయక్ హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టారు. కేబినెట్ లో లంబాడా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదని, అందుకే పీసీసీ చీఫ్గా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ది సస్పెన్స్ గా మారింది.
కేబినెట్ విస్తరణ, ప్రక్షాళన జరుగుతుందనే ప్రచారంతో ఆశావహుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.ప్రస్తుతం ఖాళీగా ఉన్న బెర్త్లను దక్కించుకోవడానికి పలువురు సీనియర్, జూనియర్ నాయకులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమ సామాజిక వర్గ సమీకరణాలు, సీనియారిటీ ఆధారంగా బెర్త్ దక్కించుకునేందుకు విజయశాంతి, బాలు నాయక్ లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.సీనియర్ నేతగా తనకున్న ఇమేజ్, మునుగోడులో సాధించిన విజయాన్ని అధిష్టానానికి వివరిస్తూ మంత్రివర్గంలో చోటు కోసం రాజగోపాల్ రెడ్డి గట్టిగా ట్రై చేస్తున్నారు.ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీనియారిటీ ఆధారంగా తన పేరును పరిశీలించాలని సుదర్శన్ రెడ్డి కోరుతున్నారు.బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల కోటాలో మంత్రివర్గంలో స్థానం సంపాదించేందుకు బీర్ల ఐలయ్య, గడ్డం ప్రసాద్ కుమార్ లు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సైతం ఈసారి మంత్రి పదవి రేసులో గట్టి పోటీ ఇస్తున్నారు.
Also read: గూస్బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్లు ఇవే!
కేవలం మంత్రివర్గ విస్తరణే కాకుండా, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానాల భర్తీలోనూ అధిష్టానానికి స్పష్టత రావడం లేదు. ప్రసాద్ కుమార్ కు కేబినెట్ లోకి తీసుకుంటే, ఆయన స్థానంలో కొత్త స్పీకర్గా ఎవరిని నియమించాలనే అంశంపై హైకమాండ్ కూడా క్లారిటీ రావడం లేదు. క్యాస్ట్, డిస్ట్రిక్ట్ , పొలిటికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ కానుందునే ఇన్ని రోజలు పాటు ఈ పదవుల భర్తీ డీలే అయిందనే చర్చ ఉన్నది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిని ఎవరికి కేటాయించాలనే దానిపై ప్రాంతీయ, సామాజిక సమతుల్యత కలసిరావడం లేదు.మంత్రివర్గ విస్తరణ, పార్టీ ప్రక్షాళన ప్రక్రియ ఆలస్యం కావడానికి అసలు కారణం ఈ అంతర్గత పోటీయేనని కాంగ్రెస్ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఒకరికి ఇస్తే మరొకరు అసంతృప్తి చెందే అవకాశం ఉండటంతో, అధిష్టానం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అందరినీ సమన్వయం చేస్తూ, వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతోనే ఈ జాప్యం జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also read: కాంగ్రెస్ పార్టీకి ఉహించని షాక్.. ఆ విషయంలో ఇక అన్ని పార్టీలు అటువైపే..?