Vijaya Dairy: వరుసగా ఏడేళ్లు చలసాని ఆంజనేయులే విజయ డెయిరీ చైర్మన్గా ఉన్నారు. ఈసారి కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలనేది టీడీపీ హైకమాండ్ అనుకుంది. అందుకే నామినేషన్ వేయవద్దని ముందే సూచించారంటున్నారు. బట్ చలసాని నామినేషన్ వేసి, ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికయ్యారు. దీంతో పార్టీ లీడర్షిప్ ఆగ్రహించినట్లుగా చర్చ జరుగుతోంది. అందుకే చలసాని హాస్పిటల్ లో చేరడం, మంత్రులు రంగంలోకి దిగడం, రాజీనామా చేసేదాకా మ్యాటర్ వెళ్లడం ఇవన్నీ హీట్ పెంచేశాయి.
Also Read: ఆర్టీసీ బస్సు రన్నింగ్లో ఉండగానే డ్రైవర్కు ఫిట్స్.. స్పాట్లో ప్రయాణికులు..!
ఈ ఎపిసోడ్ పై వైసీపీ గరంగరం అయింది. గతంలో చిత్తూరు డెయిరీని దెబ్బతీసినట్లే, ఇప్పుడు చంద్రబాబు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ డెయిరీని విస్తరించడం కోసం 1200 కోట్ల టర్నోవర్ ఉన్న విజయ డెయిరీని డౌన్ చేసే కుట్ర చేస్తున్నారని పేర్ని నాని, పుత్తా శివశంకర్ లాంటి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సో డెయిరీ ఛైర్మన్ గా చలసాని ఎన్నికై 24 గంటలు గడవక ముందే హైడ్రామా జరగడం చుట్టూ దాల్ మే కుచ్ కాలాహై అన్న డిబేట్ అయితే నడుస్తోంది. మరోవైపు విజయ డెయిరీ విస్తరణ, ప్లాంట్ భూముల కేటాయింపులకు సీఎం చంద్రబాబు హామీ ఇవ్వాలని కోరుతూ చలసాని సైడ్ అయ్యారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.