Notice to Bigg Boss Show: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన షో బిగ్బాస్. ఈ రియాలిటీ షోకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని భాషల్లోనూ ఇది బ్లాక్బాస్టర్. ఇప్పటికే హిందీలో ఈ షో 20 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక తెలుగులో 9వ సీజన్ కొనసాగుతుంది. కన్నడ, మలయాళంలో ఈ షోకి ఎంతో ఆదరణ పొందింది. ఈ షోకి ఎంతటి పాపులారిటీ ఉందో అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తుంటాయి. ఇదోక చెత్త షోని, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చెయొద్దంటూ ఎంతో మంది సామాజిక వేత్తల నుంచి అభ్యంతరాలు వస్తుంటాయి.
గతంలో తెలుగు బిగ్ బాస్పై ప్రముఖ పొలిటిషియన్ బ్రో*త*ల్ హౌజ్ అంటూ భగ్గుమన్నాడు. బిగ్ బాస్ షోని నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు ఇతర భాషల్లోనూ ఎదురవుతున్నాయి. ఇప్పుడు తాజాగా కన్నడ బిగ్ బాస్కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ షో వెంటనే ఆపేయాలంటూ రాష్ట్ర పర్యావరణ శాఖ బిగ్ బాస్ టీంకి నోటీసులు జారీ చేసింది. ఇంతకి అసలు విషయం ఏంటంటే.. కర్ణాటక శాఖ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSRCB) బిగ్ బాస్ షోపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ బిగ్ బాస్ షూటింగ్ నిలిపివేయాలని కేఎస్ఆర్సీబీ బోర్డు నోటీసులు జారీ ఇచ్చింది.
ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ 12వ సీజన్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు శివారులోని బిడడి హోబ్లిలో జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్ స్టూడియోలో బిగ్ బాస్ సెట్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల జరిగిన షూటింగ్లో బిగ్ బాస్ టీం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినట్టు కేఎస్ఆర్సీబీ బోర్డు తెలిపింది. బిగ్ బాస్ హౌజ్ నుంచి శుద్ధి చేయని మురుగునీటిని సైట్ వెలుపల విడుదల చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, బిగ్బాస్ సెట్ దగ్గరలో 250 KLD సామర్థ్యం గల మురుగునీటి శుద్ది కర్మాగారం ఏర్పాటు చేసినట్టు నిర్మాణ బ్రందం చెప్పింది.
Also Read: OG OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్న OG.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!
కానీ, ఆ సదుపాయంలో సరైన అంతర్గత డ్రైనేజీ కనెక్షన్లు లేవని ఎస్టీపీ యూనిట్ల నిర్మాణం సరిగా తనిఖీల్లో వెల్లడైంది. చెత్త నిర్వాహణ పద్దతులు దారుణంగా ఉన్నట్టు అధికారుల తనిఖీలో తేలింది. ప్లాస్టిక్ కప్పులు, పేపర్ ప్లేట్లు, ఇతర డిస్పోజబుల్ వంటి వ్యర్థాలు అన్ని బహిరంగానే వేస్తున్నట్టు బోర్డు అధికారులు గుర్తించారు. పైగా 625 KVA, 500 KVA సామర్థ్యం గల రెండు డీజిల్ జనరేటర్ సెట్లు అక్కడ ఏర్పాటు చేశారని తేలింది. ఇది పర్యావరణ రక్షణకు ఆందోళనలను రేకెస్తిస్తోందని అధికారులు అన్నారు. దీంతో బిగ్ బాస్ టీంపై STP బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే షూటింగ్ ఆపేయాలని ఆదేశిస్తూ కర్ణాటక కాలుష్య బోర్డు టీంని ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలివేయాలని సంబంధిత శాఖకు బోర్డు సూచించింది.