E-Paper
Advertisement

Alert to SBI Credit Card Holders: క్రెడిట్ కార్డుదారులకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఎంఏడీ లెక్కింపులో కొత్త పద్ధతి

Alert to SBI Credit Card Holders: క్రెడిట్ కార్డుదారులకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఎంఏడీ లెక్కింపులో కొత్త పద్ధతి
Advertisement

Changes In MAD counting System: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. దీనిని ‘ప్రతి భారతీయుల భాంకర్’ అని కూడా పిలుస్తారు. 18 మిలియన్లకు పైగా క్రెడిట్ కార్డ్‌లు అమలులో ఉన్న ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ జారీచేయడంలో దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంక్‌గ నిలిచింది. దీంతో ఈ బ్యాంకు తన క్రెడిట్ కార్డ్ విధానంలో ఏ మార్పులు చేసినా అది పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఎస్‌బీఐ తాజాగా క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం చెల్లించాల్సిన కనీస మొత్తం (మినిమం అమైంట్ డ్యూ లేద ఎంఏడీ)ని ఎలా లెక్కించాలో కొన్ని మార్పులను ప్రకటించింది.

ఈ మార్పులు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ తన క్రెడిట్ కార్డ్ దారులకు ఈ మార్పులను తెలియజేస్తూ ఈమెయిల్‌లను పంపింది. 15 మార్చి 2024 నుంచి కొత్త మార్పులు అమలులోకి వస్తాయి. కనీస మొత్తం బకాయి(ఎంఏడీ) నిర్వచనం కూడా సవరించారు. అని మెయిల్‌లో పేర్కొన్నారు. వీటితో పాటు ఎంఏడీ ప్రస్తుత గణన విధానాన్ని.. దానిలో ప్రతిపాదించిన మార్పులను కూడా మెయిల్ ద్వరా పంచుకుంది.

Advertisement

Read More: నోట్లపై గాంధీ బొమ్మే ఎందుకు..!

ప్రస్తుత ఎంఏడీ లెక్కింపు పద్ధతి..
జీఎస్‌టీ, ఈఎంఐ మొత్తలతో కలిపి 100శాతం ఫీజు లేద ఛార్జీలు, 5శాతం ఫైనాన్స్ ఛార్జీ (ఏదైనా ఉంటే), రిటైల్ ఖర్చులు నగదు అడ్వాన్స్ (ఏదైనా ఉంటే), ఓవర్‌లిమిట్ మొత్తం (ఏదైనా ఉంటే) అన్నిటిని కలిపి ఎంఏడీగా లెక్కిస్తారు.

Advertisement

సవరించిన కొత్త ఎండీఏ పద్ధతి..
ఈ సవరించిన కొత్త పద్ధతిలోను జీఎస్‌టీ, ఈఎంఐ మొత్తలతో కలిపి 100శాతం ఫీజు లేద ఛార్జీలు, 5శాతం ఫైనాన్స్ ఛార్జీ (ఏదైనా ఉంటే), రిటైల్ ఖర్చులు నగదు అడ్వాన్స్ (ఏదైనా ఉంటే), ఓవర్‌లిమిట్ మొత్తం (ఏదైనా ఉంటే) అన్నిటిని కలిపి ఎంఏడీగా లెక్కిస్తారు. కానీ

లెక్కింపు పద్ధతి రెండు ఒకే విధంగా అనిపించినప్పటికి.. ఫైనాన్స్ ఛార్జీల కంటే 5శాతం మొత్తం తక్కువగా ఉన్న సందర్భాలలో ప్రధాన మార్పులు ఉంటాయి. ‘ఫైనాన్స్ ఛార్జీల కంటే 5శాతం (ఫైనాన్స్ ఛార్జ్, రిటైల్ ఖర్చులు, నగదు అడ్వాన్స్ మొత్తం కలిపి) తక్కువగా ఉంటే.. ఎంఏడీ లెక్కింపు మొత్తం జీఎస్‌టీ, ఈఎంఐ మొత్తలతో కలిపి 100శాతం ఫీజు లేద ఛార్జీలు, 100శాతం ఫైనాన్స్ ఛార్జీ ఓవర్‌లిమిట్ మొత్తం ( ఏదైనా ఉంటే) కలిపి లెక్కిస్తారు అని ఎస్‌బీఐ బ్యాంక్ తన మెయిల్‌లో పేర్కొంది.

ఈ కొత్త సవరన పద్ధతి బిల్లు మొత్తాన్ని ప్రభావితం చేయనప్పటికీ, చెల్లించాల్సిన కనీస మొత్తం కొంత వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది తుది బిల్లులో అదనపు మొత్తాన్ని జోడించనందున ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ దారులకు ఇబ్బందులు ఉండకపోవచ్చు.

Tags

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×