E-Paper
Advertisement

Electric Vehicles: తెలంగాణలో ఈవీ వాహనాల జోరు.. 80 శాతం బైక్‌లే

Electric Vehicles: తెలంగాణలో ఈవీ వాహనాల జోరు.. 80 శాతం బైక్‌లే
Advertisement

Electric Vehicles: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల-ఈవీ వాహనాల జోరు మొదలైంది. ఈ తరహా వాహనాల సంఖ్య క్రమంగా పెరగుతున్నాయి. ముఖ్యంగా యూత్ దృష్టి ఆయా వాహనాలపై పడ్డాయి. రవాణా శాఖ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దాదాపుగా రెండు లక్షల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి.

తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య రెండు లక్షల మైలురాయిని తాకింది. మార్చి 31 నాటికి తెలంగాణలో 1.96 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్‌ అయ్యాయి. ఈ విషయాన్ని రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్ నెలలో రెండు లక్షల మార్క్‌ని క్రాస్ చేయడం ఖాయమని అంటున్నారు.

Advertisement

అమ్ముడైన ఎలక్ట్రిక్‌ వాహనాల్లో అత్యధికంగా అంటే 80 శాతం ఈవీ బైక్‌లు ఉన్నాయి. మిగతా 20 శాతం కార్లు, బస్సులు ఉన్నట్లు అధికారుల మాట. ఎలక్ట్రిక్‌ వాహనాల వల్ల యజమానులతోపాటు పర్యావరణానికీ మేలు జరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌ వాటితో పోలిస్తే ఛార్జింగ్‌ ద్వారా ఖర్చు ఆదా అవుతోందని అంటున్నారు.

దేశంలో పెరుగుతున్న కాలుష్య నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈవీ పాలసీని తీసుకొచ్చింది. ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి రోడ్‌ ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజులపై ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీంతో వాహనదారులు అటువైపు దృష్టిసారించారు. వచ్చేఏడాది డిసెంబరు 31 వరకు ఈవీ పాలసీ అమల్లో ఉండనుంది. ఈక్రమంలో వ్యక్తిగత వాహనాలు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Advertisement

ALSO READ: ఖాతాదారులకు అలర్ట్, ఈ మార్పులు తెలుసుకోండి

ప్రయాణికులను చేర వేయడంలో ఎలక్ట్రిక్‌ ఆర్టీసీ బస్సులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. 2022-23 లెక్కల ప్రకారం.. తెలంగాణలో కోటిన్నర పైగా వాహనాలు ఉన్నాయి. అందులో టూ వీలర్స్ కోటి 13 లక్షలు కాగా, మిగతా కార్లు ఉన్నాయి. ఈ లెక్కన చూసుంటే ఈవీలపై ప్రజలు ఇంకా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు కొందరు అధికారులు.

వినియోగదారులు వాడుతున్న వాహనాలకు సంబంధించిన కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్లోకి తీసుకురాలేదని అంటున్నారు.  ఆయా కంపెనీలు ఈవీలను దించి ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇస్తే ఈవీల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్  ఉందంటున్నారు. ఈవీలకు ఛార్జింగ్‌ స్టేషన్ల కొంత సమస్యగా మారిందని అంటున్నారు.

హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లున్నాయి. రూరల్, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో వాటి సమస్య ఉంది. ఎలక్ట్రిక్​ వాహనాలకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో 800 ఛార్జింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇంటి నుంచి బయలు దేరినప్పుడు ఛార్జింగ్‌ మధ్యలో అయిపోతే తమ పరిస్థితి ఏంటన్నది కొందరి మాట.  ఈ కారణంగానే ఆయా వాహనాలపై మొగ్గు చూపడం లేదని అంటున్నారు.

ఈ ఏడాది చివరికి ఛార్జింగ్‌ స్టేషన్ల సంఖ్యను 3,000 పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వం.  2030 నాటికి 6,000 ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2035 సంవత్సరం నాటికి 12,000కు పెంచాలన్నది ఆలోచన.  పెట్రోల్ బంకుల మాదిరి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెరిగితే ఈవీలకు పెరగవచ్చని అంటున్నారు.

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×