E-Paper
Advertisement

Epfo – ELI Scheme: ఉద్యోగులకు అలర్ట్.. త్వరగా UAN యాక్టివేషన్‌ చేసుకోండి!

Epfo – ELI Scheme: ఉద్యోగులకు అలర్ట్.. త్వరగా UAN యాక్టివేషన్‌ చేసుకోండి!

EPFO UAN Activation: మీరు EPFO అకౌంట్ ఉన్న ఉద్యోగులా? అయితే, ఈ న్యూస్ మీ కోసమే. ఉద్యోగుల యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌(UAN) యాక్టివేషన్‌ కు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) కీలక విషయాన్ని వెల్లడించింది. UAN యాక్టివేషన్ గడవును మరోసారి పెంచుతున్నట్లు వెల్లడించింది. నిజానికి ఈ గడువు  నవంబరు 30తో ముగిసింది. అయితే, ఇంకా కొంత మంది ఉద్యోగులు అనివార్య కారణాలతో తమ UAN యాక్టివేషన్ చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 15 వరకు పొడిగిస్తున్నట్లు EPFO సంస్థ ప్రకటించింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ లో ఉద్యోగాల్లో చేరిన వారి UAN యాక్టివ్ గా ఉండాలని సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

UAN యాక్టివ్ గా ఉంటేనే ELI బెనిఫిట్స్

UAN యాక్టివ్ గా ఉంటేనే ELI బెనిఫిట్స్ పొందే అవకాశం ఉందని EPFO సంస్థ తెలిపింది. ‘‘UAN యాక్టివేషన్‌, బ్యాంక్‌ అకౌంట్‌తో ఆధార్‌ సీడింగ్‌ కు సంబంధించిన గడువును డిసెంబర్‌ 15 వరకు పెంచాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగంలో చేరిన వారి UAN యాక్టివ్‌ గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ELI(ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్) బెనిఫిట్స్ పొందుతారు” అని ఖాతాదారులకు EPFO సూచించింది. చివరి వరకు వెయిట్ చేయకుండా వెంటనే UAN యాక్టివేట్ చేసుకోవాలని వెల్లడించింది.

మూడు ELI పథకాలను ప్రారంభించిన కేంద్రం

రీసెంట్ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం మూడు ELI పథకాలను ప్రవేశపెట్టింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

స్కీమ్ A: స్కీమ్ Aకు సంబంధించి తొలిసారి ఉద్యోగంలో చేరిన వారిని EPFO అకౌంట్స్ ఆధారంగా గుర్తిస్తారు. వారికి ఒక నెల సాలరీని ప్రొత్సాహంగా అందిస్తారు. ఈ మొత్తాన్ని సుమారు రూ.15 వేల వరకు మూడు ఇన్ స్టాల్ మెంట్స్ లో ఇస్తారు. ఈ మొత్తాన్ని పొందాలనుకునే వారి సాలరీ నెలకు రూ.లక్షలోపు ఉండాలి. అలాంటి వారే ఈ పథకానికి అర్హులు.

స్కీమ్ B: ఇక స్కీమ్ Bకు సంబంధించి ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఉద్యోగికి, యజమానికి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి. ఇందులో భాగంగా తొలిసారి ఉద్యోగాల్లో చేరిన వారికి, వారి ఎంప్లాయర్స్ కు కూడా తొలి నాలుగేళ్ల పాటు EPFO ఇన్సెంటివ్స్ అందిస్తుంది. ఈ పథకం ఉద్యోగికి, ఉద్యోగం ఇచ్చిన సంస్థకు మేలు చేస్తుంది.

Read Also: నామినీల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. కొత్తగా అమల్లోకి వచ్చిన బ్యాంకింగ్ రూల్స్ ఇవే!

స్కీమ్ C: ఇక స్కీమ్ Cలో చేరిన ప్రతి ఉద్యోగికి EPFO వాటాగా యజమానులు చెల్లించేందుకు రెండేళ్ల పాటు నెలకు రూ.3 వేల వరకు అందిస్తారు. నెలకు రూ. లక్ష వరకు సంపాదిస్తున్న ప్రతి ఉద్యోగికి ఈ పథకం ద్వారా లబ్ది పొందే అవకాశం ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ELI పథకాలను డిసెంబర్‌ నెలాఖరు నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తున్నది.

Read Also: వెంటనే మీ ఆధార్ అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే ఏం అవుతుందో తెలుసా?

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×