E-Paper
Advertisement

EPFO Update: ఈపీఎఫ్ఓ బిగ్ అప్‎డేట్.. అలా జరిగితే మీ ఫ్యామిలీకి రూ. 7 లక్షలు..

EPFO Update: ఈపీఎఫ్ఓ బిగ్ అప్‎డేట్.. అలా జరిగితే మీ ఫ్యామిలీకి రూ. 7 లక్షలు..

EPFO Update: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు సరికొత్త నిబంధనలను తీసుకొచ్చారు. ఇవి ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను పెంచే విషయంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఒక సంవత్సరం లోపు మరణించే ఉద్యోగులకు బీమా ప్రయోజనాలను కూడా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మార్పు లక్షలాది ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఉపశమనం కలిగించడంతో పాటు, వారి ఆర్థిక భద్రతను కూడా పెంచుతుంది.

కొత్త నిబంధనలు

EPFO తన డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI)లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నియమాలు ఉద్యోగులు, వారి కుటుంబాలకు మెరుగైన ఆర్థిక భద్రతను అందించడానికి లక్ష్యంగా ఉన్నాయి. ఇప్పుడు, ఒక ఉద్యోగి ఒక సంవత్సరం ముందే ఉద్యోగం మరణిస్తే, ఆయన కుటుంబానికి బీమా ప్రయోజనం లభిస్తుంది.

తక్కువ సమయం పనిచేసే ఉద్యోగులకు ప్రయోజనాలు

గతంలో ఒక ఉద్యోగి ఒక సంవత్సరం ముందే మరణిస్తే, అతని కుటుంబానికి బీమా ప్రయోజనాలు లభించేవి కావు. కానీ ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు. ఇప్పుడు, ఒక ఉద్యోగి ఒక సంవత్సరం లోపు మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 50,000 బీమా లభిస్తుంది. ఈ నిర్ణయం ప్రతి సంవత్సరం 5,000 కంటే ఎక్కువ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

Read Also: PAN Card 2.0: పాన్ కార్డ్ 2.0కు అప్లై చేశారా లేదా.. ఇలా ఈజీగా చేసుకోవచ్చు..

మునుపటి నియమాల్లో కూడా మార్పు

గతంలో ఒక ఉద్యోగి కొంతకాలం PFకు జమ చేయకపోయి మరణిస్తే, అతనికి EDLI పథకం ప్రయోజనం లభించదు. కానీ ఇప్పుడు ఈ నియమాన్ని మార్చారు. ఒక ఉద్యోగి చివరిసారిగా PF చందా చెల్లించిన ఆరు నెలల్లోపు మరణిస్తే, అతని కుటుంబానికి బీమా ప్రయోజనం లభిస్తుంది. ఈ మార్పు ద్వారా ప్రతి సంవత్సరం 14,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం ఉంటుందని అధికారులు తెలిపారు.

ఉద్యోగాలు మారినప్పుడు కూడా బీమా

ఉద్యోగాలు మారడం మధ్య ఏర్పడే అంతరానికి సంబంధించి EPFO ​​మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు, ఒక ఉద్యోగి ఒక ఉద్యోగాన్ని వదిలివేసి, రెండో కంపెనీలో ఉద్యోగంలో చేరేందుకు రెండు నెలల గ్యాప్ ఉంటే, అతనికి కూడా బీమా ప్రయోజనాలు లభిస్తాయి. ఈ మార్పు ద్వారా ఉద్యోగులు వెంటనే వేరే ఉద్యోగం చేపట్టకపోయినా రూ. 2.5 లక్షల నుంచి గరిష్టంగా రూ. 7 లక్షల వరకు బీమా ప్రయోజనాన్ని పొందుతారు. ఈ మార్పు ద్వారా ప్రతి సంవత్సరం 1,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం లభిస్తుంది.

పీఎఫ్ జమ చేయడంలో జాప్యంపై ఉపశమనం

దీంతో పాటు కంపెనీలకు పీఎఫ్ డిపాజిట్ చేయడంలో ఆలస్యం కోసం జరిమానాను EPFO తగ్గించింది. ఇప్పుడు కంపెనీలు నెలకు 1% జరిమానా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది వారికి ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ మార్పులు EPFO ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను పెంచడం, ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడడంతోపాటు వారి మంచి భవిష్యత్తుకు భరోసా ఇస్తాయని చెప్పవచ్చు.

Related News

గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇకపై ఆ కోడ్ లేకపోతే సిలిండర్ రానట్లే!

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

Big Stories

×