E-Paper
Advertisement

EPFO Update : 2024-25 ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లు ఫైనల్ – మీకు కలిగే ప్రయోజనాలేటంటే?

EPFO Update : 2024-25 ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లు ఫైనల్ – మీకు కలిగే ప్రయోజనాలేటంటే?
Advertisement

EPFO Update : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు 2024-25 ఆర్థిక ఏడాది (ఏప్రిల్-మార్చి)కి తన చందాదారులకు 8.25% వడ్డీ రేటును కొనసాగించాలని సిఫార్సు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న ఆర్థిక ఇబ్బందుల మధ్య వడ్డీ రేటు పెంపును EPFO ​​చందాదారులు ఆశించారు. కానీ.. వారి ఆశలకు భిన్నంగా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచేందుకు ట్రస్టీ మద్దతు తెలిపింది. EPFO అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT).. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ట్రస్టీ బోర్డు సిఫార్సు ఆధారంగా భారత ప్రభుత్వం వడ్డీ రేటును అధికారికంగా ప్రకటించనుంది. ఆ తర్వాత EPFO ​​వడ్డీ రేటును చందాదారుల ఖాతాల్లో జమ చేయనుంది. శుక్రవారం జరిగిన EPFO ​​సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల 237వ సమావేశంలో.. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద బీమా ప్రయోజనాలను పెంచాలని కేంద్ర బోర్డు నిర్ణయించిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

EDLI పథకం యాక్చురియల్ వాల్యుయేషన్ తర్వాత సభ్యుల కుటుంబానికి ఎక్కువ ఆర్థిక భద్రత, మద్దతును అందించడానికి బోర్డు పథకంలో కీలక మార్పులను ఆమోదించింది. ఇది ఈ వర్గం కింద ఉన్న ప్రధాన ఫిర్యాదులను పరిష్కరిస్తుంది, ప్రయోజనం పొందే హక్కుదారులకు మరింత సమగ్రమైన విధానాన్ని నిర్ధారిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం కింద.. EPF సభ్యుడు ఒక ఏడాదిలో వరుసగా జమ చేయకుండానే మరణిస్తే కనీసం రూ. 50,000 జీవిత బీమా ప్రయోజనం అందిస్తారు. ఈ సవరణ ప్రతీ ఏడాది 5,000 మందికి వర్తిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే.. కొత్త మార్పుల ప్రకారం, రెండు ఉద్యోగాల మధ్య రెండు నెలల వరకు ఖాళీగా ఉన్నా కానీ.. నిరంతరం జమ చేసినట్లుగా, సర్వీసులో ఉన్నట్లుగానే పరిగణించనున్నట్లు ట్రస్టీ వెల్లడించింది.

నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయికి ఈపీఎఫ్ డిపాజిట్లు
2021-22లో EPF డిపాజిట్ వడ్డీ రేట్లు నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.1%కి తగ్గించారు. 2020-21 సంవత్సరానికి EPF డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటును CBT మార్చి 2021లో నిర్ణయించింది. ప్రస్తుత EPF డిపాజిట్ల వడ్డీ రేటు 2015-16 సంవత్సరానికి EPF డిపాజిట్ల రేటు కంటే గణనీయంగా తక్కువగా ఉంది. గతంలో ఈ వడ్డీ రేట్లు 8.8 శాతంగా ఉండేది. ఆ తర్వాత.. EPFO ​​తన కోట్లాది మంది చందాదారులకు EPF డిపాజిట్ రేటును క్రమంగా తగ్గించింది. 2020 మార్చిలో COVID మహమ్మారి సమయంలో EPF డిపాజిట్ రేటులో గణనీయమైన తగ్గింపు చోటుచేసుకోగా.. అప్పడు ఏకంగా ఏడేళ్ల కనిష్టానికి అంటే 8.5 శాతానికి తగ్గించింది. EPFO ​​తన చందాదారులకు 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం వడ్డీ రేటును అందించింది.

Advertisement

Also Read : India’s Q3 GDP : మూడో త్రైమాసిక వృద్ధి రేటు విడుదల – ట్రంప్ సుంకాలు కొంపముంచనున్నాయా?

భారత్ లోని సంఘటిత కార్మికుల రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఏర్పాటైన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో ప్రస్తుతం 6.5 కోట్లకు పైగా చందాదారులు ఉన్నారు. వీరంతా నెలవారీగా మదుపు చేస్తుండగా.. ప్రతీ ఉద్యోగి తన జీతంలో 12%, యజమాని 12% చొప్పున ప్రతి నెలా ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంటారు. ఈ మొత్తాలకు ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రూపంలో తిరిగి నెలకు కొంత చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటారు. అలా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ నిల్వలపై 8.25% చక్రవడ్డీ లభించనుంది. కాగా.. ఈపీఎఫ్ చందాదారులు పన్ను మినహాయింపు, ముందస్తు ఉపసంహరణ, బీమా వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×