E-Paper
Advertisement

Govt Schemes: ఈ ప్రభుత్వ స్కీంలతో మహిళలు లక్షలు సంపాదించొచ్చు.. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి!

Govt Schemes: ఈ ప్రభుత్వ స్కీంలతో మహిళలు లక్షలు సంపాదించొచ్చు.. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి!

Schemes for Women: కేంద్ర ప్రభుత్వం కొన్ని అద్భుతమైన స్కీంలను మహిళలకు తీసుకువచ్చింది. ఈ స్కీముల్లో మహిళలు పెట్టుబడులు పెట్టి లక్షలు సంపాదించుకోవచ్చు. మహిళలను సంపన్నులు చేయడానికి, ఆర్థికంగా సాధికారులను చేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఇలాంటి రెండు స్కీంలను ఇక్కడ మీకు వివరిస్తాం. ఆ స్కీంలో చేరాలంటే అవసరమైన అర్హతలు, స్కీం వల్లే కలిగే ప్రయోజనాలను కూడా తెలుసుకుందాం. ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థిక సాధికారిత సాధించుకోండి.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్:

దేశవ్యాప్తంగా ఉన్న మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీం తెచ్చింది. ఈ స్కీంను కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రవేశపెట్టింది. మన దేశంలో మహిళల్లో పొదుపు అలవాటును పెంచే ఉద్దేశ్యంతో ఈ స్కీం తీసుకువచ్చింది. మన దేశంలోని మహిళలందరూ ఈ పథకానికి అర్హులే. ఈ పథకం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. ఈ కాలంలో ఏడాదికి 7.5 శాతం వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం మీ పొదుపుపై చెల్లిస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా రూ. 2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.

అర్హతలు:

మన దేశంలో నివసించే ప్రతి మహిళా ఈ స్కీంకు అర్హురాలే. మైనర్లకు వారి తల్లిదండ్రులు లేదా.. లీగల్ గార్డియన్ల ద్వారా ఈ పథకం ప్రయోజనాలు కల్పించవచ్చు. ఆ బాలిక పేరు మీద వీరు ఈ స్కీం కోసం బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది.

Also Read: MB University: కలెక్షన్ కింగ్.. ఫీజులేమైనా కలెక్షన్లా? మోహన్‌ బాబు బాగోతం బట్టబయలు!

సుకన్య సమృద్ధి యోజనా:

ఆడపిల్లలకు బంగారు భవిష్యత్ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజనా పథకాన్ని తెచ్చింది. ఈ పథకం కింద వార్షిక వడ్డీ రేటు 8.2 శాతాన్ని ప్రభుత్వం అందిస్తుంది. అంతేకాదు, ఈ మొత్తంపై మీరు ఇన్‌కమ్ ట్యాక్స్2లో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.

అర్హతలు, నిబంధనలు ఇవే

– ఈ స్కీం వర్తించాలంటే సదరు బాలికకు పదేళ్ల నిండకూడదు. ఈ స్కీం కోసం పదేళ్లలోపు ఉన్న ఆడపిల్ల పేరు మీద ఖాతా ఓపెన్ చేయాలి.
– తల్లిదండ్రులులేదా లీగల్ గార్డియన్ ఈ ఖాతా తెరవాల్సి ఉంటుంది.
– ఈ స్కీం నిబంధనల ప్రకారం ఒక బాలిక పేరు మీద ఒక ఖాతానే తెరవడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్లకు గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం రెండు ఖాతాలు మాత్రమే ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది.
– ఖాతాదారులు ఈ స్కీం కింద ఏడాదికి కనిష్టంగా కనీసం రూ. 250 రూపాయలు గరిష్టంగా రూ. 1,50,000 ఆ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.
– ఒక వేళ ఏడాదిలో కనీస మొత్తం రూ. 250 జమ చేయకుంటే పెనాల్టీగా రూ. 50 పడుతుంది.
– ఖాతా తెరిచినప్పటి నుంచి 14 ఏళ్ల వరకు ఈ ఖాతాలో డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది.
– సుకన్య సమృద్ధి యోజనా పథకం మెచ్యూరటీ కావడానికి సదరు బాలికకు 21 ఏళ్లు నిండాలి.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×