BigTV English
Advertisement

Budget 2025 Smartphone Jewellery : బడ్జెట్ ప్రభావం.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఆభరణాల ధరలు ఎంత తగ్గుతాయి?

Budget 2025 Smartphone Jewellery : బడ్జెట్ ప్రభావం.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఆభరణాల ధరలు ఎంత తగ్గుతాయి?

Budget 2025 Smartphone Jewellery | కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో కీలకమైన ఎలక్ట్రానిక్ భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (BCD) తగ్గింపును ప్రకటించింది. ఈ నిర్ణయంతో స్మార్ట్‌ఫోన్లు, టీవీల ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను సమర్పిస్తూ.. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచడం, దిగుమతి పరికరాల ధరల భారాన్ని తగ్గించడం లక్ష్యంగా అనేక చర్యలను చేపడతామని వివరించారు.


ముఖ్యంగా, మొబైల్ ఫోన్‌లు, ఛార్జర్‌లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీల (PCBA)పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 20% నుంచి 15 శాతానికి తగ్గించారు. ఈ చర్యలతో దిగుమతి అయ్యే స్మార్ట్‌ఫోన్లు, ఫోన్ ఉపకరణాల ధరలను తగ్గే అవకాశం ఉంది. 2018లో స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ఈ సుంకాన్ని 15% నుంచి 20 శాతానికి పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు దానిని తిరిగి తగ్గించింది. ఇది దిగుమతి స్మార్ట్‌ఫోన్లను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఒక అడుగుగా పరిగణించబడుతోంది.

పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయాలను స్వాగతించారు. మొబైల్ ఫోన్‌లు, పీసీబీఏ, ఛార్జర్‌లపై సుంకాల తగ్గింపు, స్మార్ట్‌ఫోన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలపై మినహాయింపులు దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయని షావోమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ బి పేర్కొన్నారు. ట్రాన్‌షన్ ఇండియా సీఈవో అరిజీత్ తలపత్రా ఈ చర్యను సానుకూల దశగా ప్రశంసించారు.


ప్రభుత్వం సుంకాల తగ్గిస్తే అవి స్మార్ట్ ఫోన్, ఇతర ఎలెక్ట్రానిక్ కంపెనీలకు లాభం చేకూరుస్తుందనడంతో సందేహం లేదు. అయితే, సుంకాల తగ్గింపు వినియోగదారులకు ఎంత ప్రయోజనం చేకూరుస్తుందనేది సందేహాస్పదంగా ఉంది. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ స్మార్ట్‌ఫోన్ ధరలలో 1-2% మాత్రమే తగ్గుదల ఉంటుందని అంచనా వ్యక్తం చేశారు. తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లపై ఇప్పటికే తక్కువ మార్జిన్‌లు ఉన్నందున, ధరలలో పెద్దగా గణనీయమైన తగ్గింపు కనిపించకపోవచ్చు.

Also Read: కొత్త బడ్జెట్‌‌లో మారిన ఇన్‌కం ట్యాక్స్ శ్లాబ్‌లు ఇవే.. రూ.12 లక్షల వరకు పన్ను లేదు!

బంగారు నగలపై సుంకాలు తగ్గింపు
బడ్జెట్ 2025లో ఆభరణాలపై కస్టమ్స్ సుంకాలను కూడా తగ్గించారు. విలువైన లోహాలు లేదా విలువైన లోహాలతో కప్పబడిన ఆభరణాలపై సుంకాన్ని 25% నుండి 20%కు తగ్గించారు. అదనంగా, ప్లాటినం ఆభరణాల తయారీలో ఉపయోగించే ప్రత్యేక వస్తువులపై సుంకాన్ని 25% నుండి 5%కు తగ్గించారు.

తగ్గిన ధరలతో ప్రజలకు లాభం చేకూరుతుందా
సుంకాల తగ్గింపు వల్ల ఆభరణాల ధర తగ్గుతుందని, వినియోగదారులకు అవి మరింత చౌకగా లభిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశీయ డిమాండ్‌కు ఊతం: ఆభరణాలు చౌకగా మారడంతో దేశీయంగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
తయారీదారులకు లాభం: ప్లాటినం ఆభరణాల తయారీకి ఉపయోగించే వస్తువులపై సుంకాల తగ్గింపు వల్ల తయారీదారులకు ఖర్చులు తగ్గుతాయి.

ఈ ప్రకటన తర్వాత ఆభరణాల కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగాయి. సెంకో గోల్డ్, మోటిసన్స్ జ్యువెలర్స్, కళ్యాణ్ జువెలర్స్ వంటి కంపెనీలు తమ స్టాక్ ధరల్లో గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. ప్రభుత్వం బడ్జెట్ లో సుంకాలు తగ్గించే ప్రకటన చేయడంతో రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు తప్పకుండా ప్రయోజనం చేకూరుతుంది.

Related News

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Big Stories

×