E-Paper
Advertisement

Xiaomi letter to India: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు భయపడుతున్నాయ్.. కేంద్రానికి షావోమి లేఖ!

Xiaomi letter to India | చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ విడిభాగాల కంపెనీలు భారతదేశంలో తయారీ యూనిట్లు పెట్టడానికి భయపడుతన్నాయని ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమి కేంద్రానికి తెలిపింది.

Xiaomi letter to India: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు భయపడుతున్నాయ్.. కేంద్రానికి షావోమి లేఖ!
Xiaomi letter to India

Xiaomi letter to India:

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ విడిభాగాల కంపెనీలు భారతదేశంలో తయారీ యూనిట్లు పెట్టడానికి భయపడుతన్నాయని ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమి కేంద్రానికి తెలిపింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో స్మార్ట్ ఫోన్ విడిభాగాల తయారీ ఫ్యాక్టరీలు స్థాపించాలని భావించి.. అందుకు షావోమి కంపెనీని సంప్రదించింది.

దేశంలోనే స్మార్ట్ ఫోన్ విడిభాగాలు తయారు చేయడానికి ప్రభుత్వం ఎటువంటి సహాయం కావాలో తెలపాల్సిందిగా షావోమి అధికారులను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా షావోమి ఇండియా ప్రెసిడెంట్ మురళికృష్ణన్.. కేంద్ర ఐటి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.

ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయే స్మార్ట్ ఫోన్ అయిన షావోమీ ఇండియా కేంద్రం అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. దేశంలో స్మార్ట్ ఫోన్ విడిభాగాల తయారు చేసే కంపెనీలకు ప్రోత్సకాలు ఇవ్వాలని, ప్రత్యేక విడిభాగాల దిగుమతిపై పన్నులు తగ్గించాలని సూచిస్తూ.. గత కొంతకాలంగా భారత ప్రభుత్వం చైనా కంపెనీలపై విచారణ చేస్తున్న సందర్భంగా చైనా కంపెనీలు ఇండియాలో ఫ్యాక్టరీలు స్థాపించడానికి భయపడుతున్నాయని తెలిపింది. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడడం లేదని షావోమి ఇండియా ప్రెసిడెంట్ మురళికృష్ణన్ అన్నారు.

2020లో ఇండియా, చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని చైనా కంపెనీలపై విచారణ చేపట్టింది. ఆ తరువాత చైనా నుంచి దిగుమతి అయ్యే స్మోర్ట్ ఫోన్ కీలక విడిభాగాలపై పన్నులు పెంచేసింది. చైనా కంపెనీలకు వ్యాపార లైసెన్సుల విషయంలో నియమాలను కఠినతరం చేసింది. ఆ తరువాత నుంచే చైనా కంపెనీల అధికారులకు భారత వీసా దొరకడం కష్టంగా మారింది.

ఈ విషయాన్ని షావోమి ఇండియా తన లేఖలో ప్రస్తావిస్తూ.. చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలతో చర్చలు జరిపి.. వారికి ఇండియాలో విడిభాగాల తయారీకి సహకారం అందిస్తామనే నమ్మకం కలిగించాలని సూచించింది.

2023లో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వీవో టెక్నాలజీ నిబంధనలు అతిక్రమించి 13 బిలియన్ డాలర్లు చట్టవ్యతిరేకంగా చైనాకు తరలించిందనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. అలాగే షావోమీకి సంబంధించిన 600 మిలియన్ డాలర్లను భారత ప్రభుత్వం సీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీలు చట్టవ్యతిరేకంగా నిధులు సరఫరా చేస్తున్నాయని భారత అధికారులు తెలిపారు.

Xiaomi, letter, India, China, smartphone, manufacturing units, Incentives,

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×