E-Paper
Advertisement

Uttar Pradesh Accident: యూపీలో యాక్సిడెంట్.. నలుగురు యూట్యూబర్లు మృతి.. ఎలా జరిగింది..?

Uttar Pradesh Accident: యూపీలో యాక్సిడెంట్.. నలుగురు యూట్యూబర్లు మృతి.. ఎలా జరిగింది..?
Advertisement

4 YouTubers Died in Uttar Pradesh Car Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు యూట్యూబర్లు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది?

అమ్రోహా జిల్లా మనోటా బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు యూట్యూబర్లు రౌండ్ టు వరల్డ్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నారు. అయితే వీరంతా కారులోని అమ్రోహాలోని హసన్‌ పూర్‌‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. భోజనం చేసి వీరంతా బయలుదేరారు. ఈ క్రమంలో మనోటా బ్రిడ్జి సమీపం లోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న మరో కారుని ఢీ కొట్టింది.

Advertisement

ఈ ఘటనలో స్పాట్‌లో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Also Read: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర దాడి.. 10కి చేరిన మృతుల సంఖ్య.. ఖండించిన ప్రధాని

Advertisement

మృతులు లక్కీ, సల్మాన్ షారూఖ్, షెహ్నవాజ్‌గా గుర్తించారు పోలీసులు. వీరంతా కామెడీ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×