BigTV English
Advertisement

Anantapuram: ఇద్దరు భార్యలు.. ఏడుగురు పిల్లలు.. కట్ చేస్తే 41 కేసులలో నిందితుడు.. అసలు ట్విస్ట్ ఇదే!

Anantapuram: ఇద్దరు భార్యలు.. ఏడుగురు పిల్లలు.. కట్ చేస్తే 41 కేసులలో నిందితుడు.. అసలు ట్విస్ట్ ఇదే!

Anantapuram: కుటుంబ భారం మోయలేక ఓ వ్యక్తి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అదేంటి ఏ మాత్రం కుటుంబ భారమో అనుకుంటున్నారా.. ఏకంగా ఇతనికి ఇద్దరు భార్యలు, ఏడుగురు సంతానం. వారిని పోషించలేక ఉన్న వృత్తిని వదిలి, దొంగగా మారాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైలు పాలయ్యాడు.


అనంతపురంకు చెందిన ఖాజాపీరా పెయింటర్ వృత్తిలో జీవనం సాగించేవాడు. ఇతనికి ఇద్దరు భార్యలు కాగా, వారికి ఏడు మంది సంతానం. రోజురోజుకు కుటుంబపోషణ భారంగా మారింది అతనికి. చాలీచాలని డబ్బులతో తన ఏడుమంది పిల్లలను పోషించలేక ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉండిపోయాడు. అంతలోనే ఖాజాపీరాకు మహేష్, జమీర్ లతో స్నేహం ఏర్పడింది. ముగ్గురు ఏకమై దొంగతనాలకు పాల్పడడం అలవాటుగా మార్చుకున్నారు. అలా కేవలం ఒక్క ఏపీలోనే చోరీలు చేశారనుకుంటే పొరపాటే.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో సైతం చోరీలకు పాల్పడ్డారు. ఉదయం పెయింటర్ పని చేయడం, రాత్రి చోరీలకు పాల్పడడం ఖాజాబీర అలవాటుగా మార్చుకున్నాడు. ఒక ఖాజా పీరా పైనే 41 కేసులు ఉన్నాయంటే, వీరు చోరీలకు పాల్పడి తీరును అంచనా వేయవచ్చు. ఈ అంతరాష్ట్ర ముఠాపై ఏపీలో 14, తెలంగాణలో 4, కర్ణాటకలో 9 కేసులు నమోదయ్యాయి. తాజాగా 300 గ్రాముల బంగారం దొంగతనం జరగడంతో ఈ ముఠా చోరీలు ఒక్కసారిగా ధర్మవరంలో వెలుగులోకి వచ్చాయి.


Also Read: Pushpa 2 In AP: పుష్ప-2 హిట్.. అంబటి ప్లాప్.. అరెరె టార్గెట్ మిస్ అయిందే!

చిట్ట చివరకు పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. పలుమార్లు జైలుకు వెళ్లిన వీరు, బయటకు రావడం మళ్ళీ చోరీలకు పాల్పడడం ఇదే అలవాటుగా మార్చుకున్నారని పోలీసులు తెలిపారు. వీరి వద్ద రూ. 22 లక్షల విలువగల 310 తులాల బంగారం, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ధర్మవరం పోలీసులు తెలిపారు. తాళం వేసిన గృహాలే టార్గెట్ గా ఎంచుకుని చోరీలకు పాల్పడే వారని, ఒకక్కరిపై పాతికకు పైగా కేసులు ఉన్నాయన్నారు. మొత్తం మీద చిన్న కుటుంబం చింతలేని కుటుంబమన్న విషయాన్ని మరచిన ఖాజాపీరా, ఏకంగా ఇద్దరు భార్యలను, ఏడుగురు పిల్లలను పోషించేందుకు దొంగగా మారి చివరగా జైలు పాలయ్యాడు.

Related News

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Big Stories

×