E-Paper
Advertisement

Car Accident: నార్సింగిలో విషాదం.. కారు ఢీకొని బలుడు మృతి..

Car Accident: నార్సింగిలో విషాదం.. కారు ఢీకొని బలుడు మృతి..
Advertisement

Car Accident: హైదరాబాద్ లోని నార్సింగి అల్కాపూరీ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు బైక్ పై వెళ్తున్న తండ్రీ కొడుకులు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ కుమార్, అతని కుమారుడు కుశల జోయల్ ఎగిరి కింద పడ్డారకు. అనంతరం బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళుతుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. తండ్రి ఒడిలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం  ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రవీణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండటంతో, దర్యాప్తు అధికారులు సీసీ ఫుటేజీలను సేకరిస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు

Advertisement

పరిసర ప్రాంతాల్లో వేగం నియంత్రణ లేకుండా వాహనాలు నడిపే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు తగ్గుతాయి అని స్థానికులు అభిప్రాయపడ్డారు.

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×