E-Paper
Advertisement

Medak News: అంతక్రియల్లో అపశ్రుతి.. మంజీరానదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి

Medak News: అంతక్రియల్లో అపశ్రుతి.. మంజీరానదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి
Advertisement

Medak News: మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అంత్యక్రియలు అనంతరం. స్నానం చేయడానికి మంజీరా వాగులో దిగి ఇద్దరు మృతి చెందారు.

వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా పేరూరు గ్రామానికి చెందిన.. చింతకింది అంజమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడంతో మంగళవారం ఆమె అంత్యక్రియలు గ్రామ సమీపంలోని శ్మశానవాటికలో నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు మంజీరా వాగు వద్దకు స్నానం చేయడానికి వెళ్లారు.

Advertisement

ఈ క్రమంలో స్నానం చేసేందుకు వాగులోకి దిగిన చింతకింది శ్రీకృష్ణ (16) అనే యువకుడు అకస్మాత్తుగా కాలుజారి లోతైన ప్రాంతానికి జారిపోయాడు. నీటిలో కొట్టుకుపోతున్న శ్రీకృష్ణను కాపాడేందుకు అతని బంధువు చింతకింది బీరయ్య (38)  వాగులోకి దూకాడు. అయితే నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో.. ఇద్దరూ బయటకు రాలేకపోయారు. క్షణాల్లోనే వారు మునిగిపోయారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని.. గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి తర్వాత మృతదేహాలను బయటకు తీశారు.

Advertisement

ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో వరుసగా ముగ్గురు మృతి చెందడంతో పేరూరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read: బాలుడిపై నుంచి దూసుకెళ్లిన కారు..

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంజీరా వాగులో ఇటీవల వరద నీరు ఎక్కువగా ఉండటంతో లోతు పెరిగిందని, అదే కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×