Screwdriver: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, ఎనిమిదేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడారు. అల్లూరి జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన ఈ బాలుడు ఆటలాడుతూ స్కూడ్రైవర్ను మింగడంతో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చిన బాలుడికి వైద్యులు వెంటనే సంబంధిత పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించారు. .
3 గంటల శ్రమించి బాలుడిని కాపాడిన వైద్యులు
ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ నేతృత్వంలోని వైద్య బృందం మూడు గంటల పాటు శ్రమించి, బాలుడి పేగులో ఇరుక్కుపోయిన స్కూడ్రైవర్ను సురక్షితంగా బయటకు తీసారు.. ఈ ఆపరేషన్ సాధారణంగా లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నది, అయితే ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు దీనిని ఉచితంగా, అత్యంత నైపుణ్యంతో నిర్వహించడం విశేషం. ఈ విజయవంతమైన చికిత్స స్థానికంగా సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
రూ.లక్ష ఖర్చయ్యే ఆపరేషన్ను.. ఉచితంగా నిర్వహించిన భద్రాచలం వైద్యులు..
ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ రామకృష్ణతో పాటు ఇతర వైద్య సిబ్బంది కూడా కీలక పాత్ర పోషించారు. వారి అంకితభావం, సమన్వయం, నైపుణ్యం ఈ సంక్లిష్ట ఆపరేషన్ను విజయవంతం చేశాయి. బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ కుమారుడి ప్రాణాలను కాపాడిన వైద్య బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన భద్రాచలం ఏరియా ఆస్పత్రి యొక్క వైద్య సేవల నాణ్యతను, ప్రభుత్వ ఆస్పత్రుల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్.. కాంగ్రెస్ టికెట్ ఏ సామాజికవర్గానికి ఇస్తారు?
తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిక..
అయితే చిన్న వయసులోనే పిల్లలు ఆటలాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, అనుకోకుండా వస్తువులను మింగడం వంటి ప్రమాదాలను నివారించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఈ అరుదైన చికిత్స ద్వారా వైద్య రంగంలో ఒక మైలురాయిని సాధించిందని చెబుతున్నారు.
స్క్రూడ్రైవర్ మింగిన బాలుడు.. సర్జరీ చేసి వెలికితీసిన వైద్యులు
భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యుల అరుదైన శస్త్ర చికిత్స
ఆడుకుంటూ 6 సెం.మీ స్క్రూడ్రైవర్ మింగేసిన గౌతమ్ అనే బాలుడు
అది పేగులో ఇరుక్కుపోవడంతో నొప్పితో విలవిలలాడిన బాలుడు
హుటాహుటిన కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా… pic.twitter.com/nq2R4kVZXf
— BIG TV Breaking News (@bigtvtelugu) September 18, 2025