Road Accident: హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ చౌరస్తాలో నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకువచ్చిన ఒక కారు అదుపుతప్పి, రోడ్డు పక్కనే ఉన్న స్వెటర్ల దుకాణంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో వేగంగా వచ్చిన కారు దుకాణంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టింది.
అయితే ఈ ప్రమాదంలో దీపక్ అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు వ్యక్తులు ప్రభు మహారాజ్, సత్తునాద్లను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ప్రమాద సమయంలో కారులో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, కారులోని ముగ్గురు వ్యక్తులను పట్టుకుని మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించారు. అయితే, కారులో ఉన్న మిగిలిన ముగ్గురు వ్యక్తులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు మృతుడి దేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పారిపోయిన మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కారు బీభత్సం
హైదరాబాద్-మైలార్దేవపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదుపుతప్పి షాపులోకి దూసుకెళ్లిన కారు
ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్లు చెబుతున్న పోలీసులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు pic.twitter.com/cuUD2LERta
— BIG TV Breaking News (@bigtvtelugu) December 17, 2025