Students Bomb Threat School| ఢిల్లీ లో గత కొన్ని నెలలుగా ప్రైవేట్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఈ బెదిరింపులు వచ్చిన ప్రతీసారి పిల్లలను స్కూల్ నుంచి బయటికి పంపేయడం .. ఆ తరువాత స్కూల్ కు యజమాన్యం సెలవు ప్రకటింస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీ లోని రోహిణి ప్రాంతంలో చాలా స్కూళ్లకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపులు ఎవరు చేశారని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విచారణ చేయగా.. షాకింగ్ నిజాలు తెలిశాయి. స్కూల్ లో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్స్ వచ్చాయి. ఆ ఈ మెయిల్స్ పంపింది.. ఆ స్కూల్ విద్యార్థులేనని పోలీసులు విచారణలో తేలింది.
దీనిపై ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటన కూడా జారీ చేశారు. “కొన్ని రోజుల క్రితం రోహిణిలోని రెండు ప్రైవేట్ స్కూళ్లలో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు ఈ బెదిరింపు ఈ మెయిల్స్ కేసు విచారణ పూర్తి చేశారు. ఆ ఈ మెయిల్స్ పంపినవారు అదే స్కూల్ కు చెందిన విద్యార్థులేనని విచారణలో తేలింది. ఇదంతా ఇద్దరు విద్యార్థులు చేశారు. ఆ ఇద్దరు విద్యార్థులు స్కూల్ లో పరీక్షల కోసం చదువుకోలేదు. ఫరీక్షల్లో ఫెయిల్ అవుతామనే భయంతో వారు బాంబులు ఉన్నట్లు స్కూల్ కు బెదిరింపు ఈ మెయిల్స్ పంపారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నాం. ఆ తరువాత కౌన్సెలింగ్ ఇచ్చి విడుదల చేశాం ” అని ఢిల్లీ పోలీస్ ప్రకటనలో పేర్కొంది.
బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చిన రెండు స్కూళ్లు రోహిణి ప్రాంతంలో ఉన్నాయి. వాటిలో ఒకటి వెంకటేశ్వర్ గ్లోబల్ స్కూల్ ఉంది. రోహిణి ప్రశాంత్ విహార్ పివిఆర్ మల్టీప్రెక్స్ లో నవంబర్ 28న ఒక బాంబు పేలింది. ఈ ఘటన జరిగిన తరువాత అదే ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర్ గ్లోబల్ స్కూల్ లో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్ ద్వారా బెదిరించారు.
Also Read: శోభనం రాత్రి గంజాయి, మటన్ కావాలన్న పెళ్లికూతురు.. ఆమె ఆడది కాదన్న అనుమానంతో వరుడు!
అదే ప్రాంతంలోని మరో స్కూల్ లో కూడా ఇలాగే బాంబు ఉన్నట్లు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. ఇవి రెండు వేర్వేరు ఘటనలు. రెండు ఘటనల్లో కూడా విద్యార్థులే దోషులని పోలీసులు తేల్చారు. బాంబు బెదిరింపులు రావడంతో స్కూల్ లో తనిఖీలు చేయడానికి రెండు రోజుల సెలవులు ఇచ్చారు.
బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ పంపిన విద్యార్థులు.. కౌన్సెలింగ్ సమయంతో తామే ఆ ఈ- మెయిల్స్ పంపినట్లు అంగీకరించారు. గత కొంత కాలంగా ఢిల్లీ లో స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తుండడంతో తమకు ఈ ఐడియా వచ్చిందని చెప్పారు. అయితే పోలీసులు వారి తల్లిదండ్రులను హెచ్చిరించి విద్యార్థులను విడుదల చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో గత 11 రోజుల్లో అనూహ్యంగా 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే బెదిరింపు ఈమెయిల్స్ ద్వారానే వస్తున్నాయి. పోలీసులు ఈ మెయిల్స్ ట్రాక్ చేయకుండా దుండగలు విపిఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్) ఉపయోగించి ఈ మెయిల్స్ పంపిస్తున్నారు. ఈ సంవత్సరం మే నెల నుంచి ఢిల్లీలోని స్కూళ్లు, ఆస్పత్రులు, ఎయిర్ పోర్టులు, విమాన కంపెనీలకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకూ ఈ బెదిరింపులు ఎవరు చేస్తున్నారనేది పోలీసులు కనిపెట్టలేకపోయారు.