E-Paper
Advertisement

Hyderabad: ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఓ కుటుంబం.. ఒకరి పరిస్థితి డేంజర్, ఏం జరిగింది?

Hyderabad: ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఓ కుటుంబం.. ఒకరి పరిస్థితి డేంజర్, ఏం జరిగింది?
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో ఐదుగురు సభ్యుల ఫ్యామిలీ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమం కాగా, మరో నలుగురికి పర్వాలేదని వైద్యులు చెబుతున్నారు. ఏం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..

హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని కోదండరామ్ నగర్‌ ప్రాంతంలో ప్రసాద్ ఫ్యామిలీ ఉంటోంది. ఐదుగురు సభ్యుల ఈ ఫ్యామిలీ. ప్ర‌సాద్‌(60), లతా (55), పిల్ల‌లు సాయి స్వరూప్, సందీప్, వంశీలు. అయితే వీరికి ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి.

Advertisement

అసలు ఏం జరిగిందో తెలీదుగానీ ఈ ఫ్యామిలీకి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దాని నుంచి తేరుకోడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య ఒక్కటే కారణమని డిసైడ్ అయ్యారు ఇంటి పెద్దాయన.

సోమవారం రాత్రి సమయంలో పాయిజన్ తాగి ఫ్యామిలీ సభ్యులంతా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సరూర్‌నగర్ పోలీసులు ప్రసాద్ ఇంటికి చేరుకుని కుటుంబం మొత్తాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ALSO READ: త్రిపురలో దారుణం.. కన్నతల్లిని కుమారులే చెట్టుకు కట్టేసి సజీవ దహనం!

ప్రస్తుతం అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అందులో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మరో నలుగురు ఔట్ ఆఫ్ డేంజర్ అని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ఆర్థిక సమస్యలకు కారణమేంటి? అనేదానిపై వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

 

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×