Visakhapatnam Girl Incident: విశాఖ జిల్లా తాటిచెట్లపాలెంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలయని చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. డెడ్బాడిని ముక్కలు ముక్కలుగా చేసి కప్పరాడ బేతెస్థ చర్చి సమీపంలోని కాలువలో పడేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కంచరపాలెం రాజీవ్ నగర్లోని సంజీవయ్య కాలనీలోని కప్పరాడ బేత చర్చ్ పక్కన ఉన్న కాలువలో పసికందు శరీర బాగాలు.. కాళ్ళు, చేతులు ముక్కలుగా లభ్యమయ్యాయి. అయితే ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓ కాలువలో మైనర్ బాలికను ముక్కలు ముక్కులగా ఉన్న బాడీ పార్ట్స్ను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థాలానికి చేరుకుని అక్కడి ప్రాంతాన్ని పరీశిలించారు. కాలువలో గుర్తించలేని విధంగా శరీర బాగాలు పడి ఉన్నాయి. కానీ ఇంకా తల భాగం లభించలేదు అని తెలిపారు.
Also Read: దారుణం.. భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త.. కూతురిపై కూడా..
అయితే ఈ ఘటన జరిగి దాదాపు 10 నుంచి 15 గంటలు అయ్యిందని తెలిపారు. అంతేకాకుండా అసలు ఈ బాలికను ఎందుకు హత్య చేశారు? ఈ బాలిక తల్లిదండ్రులు ఎవరు? ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏంటి..? అసలు ఎవరు చంపారు.. తల్లిదండ్రులా.. లేదా కుటుంబ సభ్యులా లేదా.. వేరే ఇంకెవరైన చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పసికందు శరీర బాగాల నుంచి ఫోరెన్సిక్ బృందం శాంపిల్స్ తీసుకుంది. పోలీసులు బాలిక శరీర బాగాలను kgh కు తరలించారు. అంతేకాకుండా ఆశ వర్కర్స్ ద్వారా గర్భిణీల వివరాలను పరిశీలిస్తున్న పోలీసులు.. ఏది ఏమైనా ఇలాంటి దారుణానికి పాల్పడినవారిని దారుణంగా శిక్షించాలని.. అక్కడి స్థానికులు తెలిపారు.