BigTV English

Hanamkonda: క్లాస్ రూమ్‌లో అకస్మాత్తుగా ప్రాణాలు విడిచిన 4వ తరగతి విద్యార్థి.. వైద్యులు చెప్పిన కారణం ఇదే

Hanamkonda: క్లాస్ రూమ్‌లో అకస్మాత్తుగా ప్రాణాలు విడిచిన 4వ తరగతి విద్యార్థి.. వైద్యులు చెప్పిన కారణం ఇదే
Advertisement

Hanamkonda: హనుమకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి చెందాడని అతడి బంధువులు గురువారం పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.


హనుమకొండలోని నయీమ్ నగర్ తేజస్వి హై స్కూల్ లో గురువారం ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యార్థి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. నాలుగో తరగతి చదువుతున్న బానోతు సుజిత్ ప్రేమ్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లోనే కింద పడిపోవడంతో స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి విద్యార్థి బ్రెయిన్ డెడ్ కావడంతో మృతి చెందాడని తెలిపారు.

విద్యార్థి మృతిపై అనుమానాలు

పాఠశాల యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఏదో జరిగిందని, యాజమాన్యమే పిల్లాడిని కొట్టి చంపారని ఆరోపించారు. ఆరోగ్యంగా ఉన్న తమ కుమారుడు ఏ విధంగా చనిపోతాడని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆరోగ్యంగా, చురుకుగా ఉన్న తమ కొడుకు ఎలా చనిపోతాడని తల్లిదండ్రులు ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని కోరారు.


10వ తరగతి విద్యార్థి మృతి ఘటన మరువక ముందే

నయీమ్ నగర్ లోని తేజస్వి పాఠశాల విద్యార్థుల వరస మరణాలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 45 రోజుల క్రితం పదో తరగతి చదువుతున్న జయంతి వర్ధన్ అనే విద్యార్థి పాఠశాల గ్రౌండ్ లో ఆడుకుంటుండగా హార్ట్ ఎటాక్ రావడంతో కింద పడి మృతి చెందాడు. ఆ ఘటన నుంచి విద్యార్థులు తేరుకోకముందే మరో విద్యార్థి మృతి చెందడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు భయందోళన చెందుతున్నారు.

Also Read: Medak News: రూటు మార్చిన గంజాయి స్మగ్లర్లు.. పోలీసులపై దాడి, మెదక్‌లో రాత్రి ఏం జరిగింది?

విద్యార్థి సంఘాల ఆందోళన

హనుమకొండలోని తేజశ్రీ పాఠశాల ముందు పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాఠశాలలో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల అనుమతి రద్దు చేసి పాఠశాలను వెంటనే మూసివేయాలని విద్యార్థి సంఘాల నాయకులను డిమాండ్ చేశారు.

Related News

Teenager Death: పటాసులు కొనలేనంత పేదరికం.. ఇంట్లోనే బాంబు తయారీ, భారీ పేలుడులో టీనేజర్ దుర్మరణం!

UP Shocker: కుక్కపై ప్రేమ.. బాలుడికి కరెంట్ షాకిచ్చి, విషం పెట్టేసి చంపేసిన యజమాని!

Fake Currency: విశాఖలో దొంగ నోట్ల కలకలం.. మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి అరెస్ట్

Bengaluru Crime: మహిళపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత ఇంట్లో దోపిడీ, బెంగుళూరులో షాకింగ్ ఘటన

Tuni Case Update: చెరువులో దూకే ముందు ఏం జరిగిందంటే.. తుని సీఐ చెప్పిన నిజాలు

Tuni case update: తుని ఘటన.. చెరువులోకి దూకి తాత ఆత్మహత్య

Delhi Encounter: ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతం, టార్గెట్ బీహార్ ఎన్నికలు?

Big Stories

×