E-Paper
Advertisement

Husband Killed Wife: పండంటి కాపురం మధ్య చిచ్చుపెట్టిన సోషల్ మీడియా..!

Husband Killed Wife: పండంటి కాపురం మధ్య చిచ్చుపెట్టిన సోషల్ మీడియా..!
Advertisement

Husband kills Wife in Uppal Hides Body in Trash Bag: భార్యాభర్తల పండంటి కాపురం మధ్య సోషల్ మీడియా చిచ్చు పెట్టింది. రీల్స్ చేస్తూ.. ఫోన్ లోనే గంటలు తరబడి ఉంటుందనే అనుమానంతో భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఆ తర్వాత మృత దేహాన్ని సైతం మాయం చేసేందుకు యత్నించి విఫలమవ్వడంతో పరారైనట్టు తెలుస్తోంది.

భార్యతో పాటు కన్న బిడ్డను సైతం నదిరోడ్డుపై వదిలేసి నిర్దాక్షిణ్యంగా తన దారి తాను చూసుకున్నాడు ఓ దుర్మార్గుడు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడడంతో నిందితుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఊహించని ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ పరిధిలో గల న్యూ భారత్ నగర్ ఏరియాలో చోటు చేసుకుంది.

Advertisement

ఒరిస్సాకు చెందిన ప్రదీప్ బోలా, మధు స్మిత దంపతులు న్యూ భరత్ నగర్ ఏరియాలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇంట్లోని నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ కి అనుమానం వచ్చి.. తలుపులు తెరచి చూడగా.. అనుమానస్పదంగా ఓ మూట కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాత్రూంలో బస్తా సంచిలో మధు స్మిత మృతదేహాన్ని గుర్తించారు.

Also Read: కమ్మరి కృష్ణను చంపింది కొడుకే.. వివరాలు వెల్లడించిన పోలీసులు

Advertisement

ఇక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 12 గంటల్లోనే చేధించారు. మధుస్మితను.. అర్ధరాత్రి వేళ చపాతి పీటతో తలపై కొట్టడంతో స్పృహ కోల్పోగా.. ఆ తర్వాత చున్నితో ఆమె మెడకు బిగించి ప్రదీప్ హత్య చేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఇంటి నుంచి పరారై బేగంపేటలో తన స్నేహితుడి దగ్గర ఉన్నట్టు తెలిపారు. ప్రదీప్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు చెప్పారు. మొత్తానికి సోషల్ మీడియా భూతానికి మరో జంట బలి

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×