E-Paper
Advertisement

Sangareddy Crime: పాఠాలు చెప్పేందుకు క్లాస్ రూంకి వెళ్లిన టీచర్.. అంతలోనే ఒక్కసారిగా..?

Sangareddy Crime: పాఠాలు చెప్పేందుకు క్లాస్ రూంకి వెళ్లిన టీచర్.. అంతలోనే ఒక్కసారిగా..?
Advertisement

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో విధులను నిర్వహిస్తున్న సమయంలోనే ఓ ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మరణించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జహీరాబాద్ పట్టణంలోని నెంబర్ 4 యూపీఎస్ పాఠశాలలో ఎస్జీటీ -స్కూల్ అసిస్టెంట్ గా సుజాత విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం టీచర్ సుజాత పాఠశాలకు చేరుకున్నారు. ఎప్పటిలాగే, ఆమె విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు తరగతి గదిలోకి వెళ్లారు. అయితే, విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సమయంలోనే సుజాతకు అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది. నొప్పిని భరించలేక ఆమె కుర్చీలో ఒక్కసారిగా కూలబడ్డారు. ఉపాధ్యాయురాలి పరిస్థితిని గమనించిన తోటి ఉపాధ్యాయులు వెంటనే టీచ్ సుజాతను చికిత్స నిమిత్తం జహీరాబాద్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో.. మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు. అయితే, సంగారెడ్డికి తరలించే మార్గమధ్యంలోనే సుజాత గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు, తోటి ఉపాధ్యాయులు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే టీచర్ సుజాత అకస్మాత్తుగా మరణించడంతో పాఠశాలలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 40 ఏళ్ల సుజాత మృతి పట్ల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

ALSO READ: Sub Inspector: డిగ్రీ అర్హతతో 2861 ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. అక్షరాల రూ.1,12,400 జీతం

Advertisement

మృతురాలు సొంత గ్రామం కోహిర్ మండలం పగిడి గుమ్మల్ విలేజ్. ఈ రోజు సాయంత్రం స్వగ్రామంలో గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు విద్యాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ALSO READ: DSSSB  Teacher: భారీగా అసిస్టెంట్ టీచర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.లక్షకు పైగా జీతం, వారం రోజులే సమయం..!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×