E-Paper
Advertisement

Kamareddy Crime: కామారెడ్డి జిల్లాలో భర్త కిరాతకం.. భార్య నాలుక కోసి, రోకలితో బాది దారుణ హత్య

Kamareddy Crime: కామారెడ్డి జిల్లాలో భర్త కిరాతకం.. భార్య నాలుక కోసి, రోకలితో బాది దారుణ హత్య
Advertisement

Kamareddy Crime: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను భర్త అత్యంత క్రూరంగా హత్య చేశాడు. నాలుక కోసి రోకలి బండతో తలపై బాది భార్యను హతమార్చాడు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్‌ మండలం విఠల్‌వాడీతండాలో గురువారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది.

అనుమానంతో

తండాకు చెందిన పవార్‌ కిషన్, పవార్‌ సవిత(42) ఉపాధి కోసం పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌ కు వలస వచ్చారు. లింగంపల్లిలో టీకొట్టు పెట్టుకొని దంపతులు జీవనం సాగిస్తున్నారు. తండాలో గుడి పండగ ఉండటంతో 5 రోజుల క్రితం కిషన్, సవిత ఊరుకు వెళ్లారు. అయితే గత కొద్దిరోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కిషన్‌ గురువారం రాత్రి ఆమెతో గొడవకు దిగాడు.

నాలుక కత్తిరించి, రోకలితో బాది హత్య

Advertisement

మద్యం మత్తులో భార్యతో ఘర్షణపడి కత్తెరతో ఆమె నాలుక కత్తిరించాడు. అనంతరం రోకలి బండతో భార్య తలపై బలంగా కొట్టాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించేందుకు రాగా.. వారిపైనా కిషన్ దాడికి దిగాడు. అతడిని బంధించి సవితను ఆసుపత్రికి తరలిస్తుండంగా, మార్గం మధ్యలో ఆమె మృతి చెందింది. సవిత అన్న జాదవ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కిషన్ ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో సంచలనం.. మద్యం మత్తులో బైకర్.. సీసీ కెమెరా దృశ్యాలు వైరల్

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×