Koti Robbery: హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపాయి. కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో మనీ డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్ అనే వ్యక్తి నుంచి ఇద్దరు దుండగులు రూ.6 లక్షలు కొట్టేశారు. వారిని ప్రతిఘటించిన ఘటనలో అతడిపై కాల్పులు జరిపారు. దీంతో బాధితుడి కాలుకి తూటా గాయమైంది. ఈ చోరీ కేసు పోలీసులకు సవాల్ గా మారిన మారింది. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద స్థానికులు చూస్తుండగానే గన్ తో కాల్పులు జరపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బ్లాక్ కలర్ స్కూటీపై వచ్చి రషీద్ పై కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు.
రషీద్ బ్యాగ్ తో ఏటీఎంలోకి వెళ్లే ముందు నిందితులు రెక్కీ నిర్వహించారు. రషీద్ ఉదయం 7 గంటలకే వస్తాడని దుండగులకు ముందే తెలిసినట్లు అనిపిస్తుంది. నగదు డిపాజిట్ చేసే సమయం, పారిపోయేందుకు రూట్ మ్యాప్ ముందే సిద్ధం చేసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులు ముందే రెక్కీ నిర్వహించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు రషీద్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
కోఠి కాల్పుల ఘటనలో వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్
బాధితుడు రిన్షద్ స్కూటీ దిగేలోగా అతన్ని చుట్టుముట్టిన ఇద్దరు వ్యక్తులు
ముందుగా బెదిరించి క్యాష్ తీసుకునే ప్రయత్నం
రిన్షద్ ప్రతిఘటించడంతో క్యాష్ తీసుకుని
గన్ తో కాలిపై కాల్పులుబాధితుడు స్కూటీపైనే పారిపోయిన నిందితులు… https://t.co/s1k4nAKsx4 pic.twitter.com/QZXWzk52Pq
— BIG TV Breaking News (@bigtvtelugu) January 31, 2026
చోరీ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. రషీద్ ఏటీఎంలోకి వెళ్లడాన్ని గమనించిన దుండగుడు మరో వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. అతడు ఏటీఎంలోకి వెళ్లి రషీద్ నుంచి బ్యాగ్ లాక్కున్నాడు. రషీద్ ప్రతిఘటించే ప్రయత్నం చేయగా అతడిపై కాల్పులు జరిపారు. రషీద్ కాలుకు గాయమైంది. అనంతరం ఇద్దరు నిందితులు స్కూటీపై పరారయ్యారు. ఈ చోరీ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు అనిపిస్తుంది. నిందితులు సరిగ్గా రషీద్ ఆ సమయంలో అక్కడికి వస్తున్నట్లు నిందితులకు ఎలా తెలిసింది? ఇది తెలిసిన వాళ్ల పనేనా? అని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు