Private School Fire: సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఉదయం కాలం జరిగినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. ఉదయం స్కూలులోనుండి దట్టమైన పొగలు రావడంతో అక్కడి స్ధానికులు గమనించారు. దీంతో ఓక్కసారిగా స్కూలు లోపలినుండి మంటలు పైకి చెలరేగడంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు వెంటనే పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ తో మంటలు అదుపుచేయడానికి ప్రయత్నించారు.
సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లి జంక్షన్ వద్ద శ్రద్ధా అనే ప్రైవేట్ స్కూల్ ఉంది. అయితే నేడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో స్కూలుకు సెలవు ప్రకటించారు. అయితే ఉదయం స్కూలు లోపలనుండి దట్టమైన పోగలు వస్తున్నాయి. దీంతో దాన్ని గమనించిన స్థానికులు హుటాహుడిన పోలీసులకు మరియు స్కూలు యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బందితో కలిసి మంటలు అదుపు చేయడం మోదలు పెట్టారు. ఉదయం 10:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్ధానికులు తెలిపారు.
Also Read: Jana Nayagan: జననాయగన్ విడుదలకు లైన్ క్లియర్.. కొత్త డేట్ ఎప్పుడంటే?
నేడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో యాజమాన్యం స్కూలుకు సెలవు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్కూల్ కి హాలిడే ఉండటంతో స్కూలుకు పిల్లలు ఎవరు రాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేదని అక్కడి స్థానికులు తెలిపారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది. ఎవరైనా కావాలని చేసారా లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో అగ్ని ప్రమాదం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్కూల్ కి హాలిడే ఉండటంతో తప్పిన పెను ప్రమాదం
రెండు ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు అనుమానం
Fire accident… pic.twitter.com/phuoKgFa98
— BIG TV Breaking News (@bigtvtelugu) February 11, 2026
Also Read: Fake Silver Coins: మున్సిపల్ ఎన్నికల్లో నకిలీ వెండి నాణేలు పంచిన బీజేపి అభ్యర్ధి..?