E-Paper
Advertisement

Private School Fire: సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు

Private School Fire: సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు

Private School Fire: సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఉదయం కాలం జరిగినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. ఉదయం స్కూలులోనుండి దట్టమైన పొగలు రావడంతో అక్కడి స్ధానికులు గమనించారు. దీంతో ఓక్కసారిగా స్కూలు లోపలినుండి మంటలు పైకి చెలరేగడంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు వెంటనే పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ తో మంటలు  అదుపుచేయడానికి ప్రయత్నించారు.

వివరాల్లోకి వెలితే..

సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లి జంక్షన్‌ వద్ద శ్రద్ధా అనే ప్రైవేట్ స్కూల్‌ ఉంది. అయితే నేడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో స్కూలుకు సెలవు ప్రకటించారు. అయితే ఉదయం స్కూలు లోపలనుండి దట్టమైన పోగలు వస్తున్నాయి. దీంతో దాన్ని గమనించిన స్థానికులు హుటాహుడిన పోలీసులకు మరియు స్కూలు యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బందితో కలిసి మంటలు అదుపు చేయడం మోదలు పెట్టారు. ఉదయం 10:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్ధానికులు తెలిపారు.

Also Read: Jana Nayagan: జననాయగన్ విడుదలకు లైన్ క్లియర్.. కొత్త డేట్ ఎప్పుడంటే?

తప్పిని ప్రమాదం..

నేడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో యాజమాన్యం స్కూలుకు సెలవు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్కూల్ కి హాలిడే ఉండటంతో స్కూలుకు పిల్లలు ఎవరు రాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేదని అక్కడి స్థానికులు తెలిపారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది. ఎవరైనా కావాలని చేసారా లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Also Read: Fake Silver Coins: మున్సిపల్ ఎన్నికల్లో నకిలీ వెండి నాణేలు పంచిన బీజేపి అభ్యర్ధి..?

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×