E-Paper
Advertisement

Gang Rape In Kadapa : బెదిరించి బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో మైనర్..

Gang Rape In Kadapa : బెదిరించి బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో మైనర్..
Advertisement

Gang Rape In Kadapa : ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా, ఎంత కఠినంగా వ్యవహరించినా ఆడపిల్లలు, మహిళలపై దారుణాలు ఆగడం లేదు. రోజూ ఎక్కడో ఓ చోట.. అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉంటున్నాయి. అయితే.. దారుణంగా బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు సైతం నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.  తాజాగా.. కడప జిల్లాలో ఓ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన నెల రోజుల తర్వాతి.. బాధిత బాలిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది.

కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రాంతానికి చెందిన ఓ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం. కాగా.. అత్యాచారం ఘటన సమయంలో వీరికి తోడుగా మరో బాలుడు కూడా వెళ్లాడని పోలీసులు చెబుతున్నారు. కాగా.. ఈ ఘటన నెల రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.

Advertisement

చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన  ఓ మైనర్‌ బాలికను బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు.  బాధిత బాలిక.. తన ఇంటికి సమీపంలోని ఓ యువకుడితో ఒంటరిగా మాట్లాడుతున్నప్పుడు.. వీడియో తీసిన నిందితులు.. దాన్ని చూపించి బెదిరించారు. తాము చెప్పినట్లు వినకపోతే.. ఆ వీడియోను అందరికీ చూపిస్తామని, బాలిక ఇంట్లోని తల్లిదండ్రులకు చూపిస్తామని భయపెట్టించారు. దాంతో.. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో.. నిందితులకు లొంగిపోయిన బాలిక వారి చేతిలో అత్యాచారానికి గురైంది.

అత్యాచారానికి పాల్పడిన వారిలో ఉదయ్ కిరణ్ అనే ఓ వ్యక్తి కీలకం కాగా.. మరోకరు మైనర్. వీరిద్దరూ అత్యాాచారానికి పాల్డడగా.. వాళ్లకు తోడుగా వెళ్లిన మరో బాలుడు సైతం ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఇన్నాళ్లు బయటకు చెప్పడానికి భయపడిన బాలిక.. ఎట్టకేలకు విషయాన్ని ఇంట్లో చెప్పింది. దాంతో..  బాలిక తండ్రి కడపలోని దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Also Read :  భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. రూ.2 లక్షలు కావాలని బ్లాక్‌మెయిల్

ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. చింతకొమ్మదిన్నె సీఐ శంకర్ నాయక్ ఆదేశాలతో ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితుల్ని గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×