E-Paper
Advertisement

East Godavari district: తూర్పులో రేవ్ పార్టీ, చిక్కిన అమ్మాయి.. పరారీలో యజమాని

East Godavari district: తూర్పులో రేవ్ పార్టీ, చిక్కిన అమ్మాయి.. పరారీలో యజమాని
Advertisement

East Godavari district: న్యూఇయర్ వేళ రేవ్ పార్టీలకు సిద్దమవుతున్నారు కొందరు వ్యక్తులు. అటు వైపు పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీని భగ్నం చేశారు. మొత్తం ఐదుగురు అమ్మాయిలు, 10 మంది యువకులు పట్టుబడ్డారు.

ఇంకా లోతుల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన 10 మంది యువకులు భారీగా రేవ్ పార్టీకి ప్లాన్ చేశారు. న్యూఇయర్ వస్తుండగా గుంటూరు నుంచి ఐదుగురు అమ్మాయిలను రాజమండ్రికి రప్పించారు. కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఉన్న నాగసాయి ఫంక్షన్ రేవ్ పార్టీకి వేదికైంది.

Advertisement

రేవ్ పార్టీ వ్యవహారం పోలీసుల చెవిలో పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు దాడి చేశారు. ఐదుగురు అమ్మాయిలతోపాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూడు కార్లు సీజ్ చేశారు. దాడులతో ఫంక్షన్ హాల్ యజమాని పరారీ అయ్యాడు. హాలు యజమాని లేకపోవడంతో కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. వారందర్నీ కోరుకొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

పట్టుబడిన పలువురికి తమదైన కౌన్సెలింగ్ ఇచ్చారు పోలీసులు. అక్కడి నుంచి వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. రేవ్ పార్టీలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా అనే దానిపై పరీక్షలు చేశారు. ఎవరూ తీసుకోలేదని తేలింది. ఇటీవల కాలంలో రేవ్ పార్టీలు గోదావరి జిల్లాల్లో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు అటు వైపు దృష్టి సారించారు.

Advertisement

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×