E-Paper
Advertisement

East Godavari district: తూర్పులో రేవ్ పార్టీ, చిక్కిన అమ్మాయి.. పరారీలో యజమాని

East Godavari district: తూర్పులో రేవ్ పార్టీ, చిక్కిన అమ్మాయి.. పరారీలో యజమాని

East Godavari district: న్యూఇయర్ వేళ రేవ్ పార్టీలకు సిద్దమవుతున్నారు కొందరు వ్యక్తులు. అటు వైపు పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీని భగ్నం చేశారు. మొత్తం ఐదుగురు అమ్మాయిలు, 10 మంది యువకులు పట్టుబడ్డారు.

ఇంకా లోతుల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన 10 మంది యువకులు భారీగా రేవ్ పార్టీకి ప్లాన్ చేశారు. న్యూఇయర్ వస్తుండగా గుంటూరు నుంచి ఐదుగురు అమ్మాయిలను రాజమండ్రికి రప్పించారు. కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఉన్న నాగసాయి ఫంక్షన్ రేవ్ పార్టీకి వేదికైంది.

రేవ్ పార్టీ వ్యవహారం పోలీసుల చెవిలో పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు దాడి చేశారు. ఐదుగురు అమ్మాయిలతోపాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూడు కార్లు సీజ్ చేశారు. దాడులతో ఫంక్షన్ హాల్ యజమాని పరారీ అయ్యాడు. హాలు యజమాని లేకపోవడంతో కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. వారందర్నీ కోరుకొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

పట్టుబడిన పలువురికి తమదైన కౌన్సెలింగ్ ఇచ్చారు పోలీసులు. అక్కడి నుంచి వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. రేవ్ పార్టీలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా అనే దానిపై పరీక్షలు చేశారు. ఎవరూ తీసుకోలేదని తేలింది. ఇటీవల కాలంలో రేవ్ పార్టీలు గోదావరి జిల్లాల్లో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు అటు వైపు దృష్టి సారించారు.

 

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×